పాకిస్థాన్ ని తీవ్రంగా హెచ్చరించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్!

షార్ట్స్‌లో చూడండి
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ దేశంపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘సర్జికల్ దాడులు మళ్లీ మళ్లీ జరుగుతాయి’ అంటూ పాకిస్థాన్ ని హెచ్చరించారు. పాక్ చర్యలకు ప్రతీకారంగా ఎల్ ఓసీ దాటి ఆ దేశ సైన్యంపై భారత బలగాలు కాల్పులు జరిపిన విషయాన్ని విలేకరులు ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించాల్సి వచ్చింది.

కాగా, గత శనివారం పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత జవాన్లపై కాల్పులు జరిపిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ప్రతీకార చర్యల్లో భాగంగా భారత సైన్యం ఎల్ ఓసీ దాటి పాక్ సైన్యంపై నిన్న కాల్పులకు పాల్పడినట్టు నిఘా వర్గాల సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు పాక్ సైనికులు మృతి చెందారని సమాచారం.
Go Back to Shorts
Pakistan
yogi

More Telugu News