India: ఆదిలోనే భారత్ కు ఎదురుదెబ్బ... 3 ఓవర్లు, 2 పరుగులు, 1 వికెట్

  • మొదట్లోనే భారత్ కు కష్టాలు
  • డక్కౌట్ అయిన శిఖర్ ధావన్
  • భారత స్కౌరు 3 ఓవర్లలో 2/1

టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఏంజిలో మ్యాథ్యూస్ వేసిన ఓవర్ ఆరో బంతికి శిఖర్ ధావన్ డక్కౌట్ అయ్యాడు. ఆ ఓవర్ లో ఒక్క పరుగు కూడా చేయలేకపోయిన ధావన్ పెవీలియన్ దారి పట్టడంతో స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా చేరకుండానే భారత జట్టు వికెట్ కోల్పోయింది. ఇక మరో ఓపెనర్ రోహిత్ శర్మకు తోడుగా శ్రేయాస్ అయ్యర్ వచ్చి కలిశాడు. భారత స్కోరు 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 2 పరుగులు.

More Telugu News