రాహుల్ గాంధీనే తన ప్రత్యర్థి అని మోదీకి ఇప్పటికి అర్థమైంది: శివసేన
- ‘పప్పు’ ముద్ర నుంచి రాహుల్ బయటపడ్డారు
- స్వశక్తితో ఎదిగి మోదీకి ప్రత్యర్థిగా మారారు
- ప్రశంసించిన శివసేన ‘సామ్నా’
రాహుల్ గాంధీ చివరికి తాను ‘పప్పు’ను కాదని నిరూపించుకున్నారని, బీజేపీ ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకుని తీరాలని పేర్కొంది. ఇక అంతా తమకు అనుకూలంగా ఉందని, ప్రజలు తమవైపు ఉన్నారన్న భ్రమల నుంచి బీజేపీ బయటకు వస్తే మంచిదని శివసేన సూచించింది. అనుకూలమైన పరిస్థితుల్లో రాహుల్ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నారని సామ్నా పేర్కొంది.
రాహుల్ గాంధీని ఔరంగజేబుతో పోల్చడంపైనా సామ్నా విరుచుకుపడింది. కాంగ్రెస్ వస్తే మొఘలుల రాజ్యం వస్తుందని ప్రచారం చేస్తున్న బీజేపీ మహారాష్ట్రలోని ఔరంగజేబు, అఫ్జల్ సమాధులను కూల్చివేయాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ను ఆదేశించాలని పేర్కొంది.