పక్కింటి వ్యక్తితో భార్య అక్రమ సంబంధం... అనుమానంతో ముగ్గురిని కాల్చి చంపిన జవాను!
- సీఐఎస్ఎఫ్ లో పనిచేస్తున్న సురేందర్
- రాత్రి ఇంటికి రాగా, ఆరుబయట పక్కింటి రాజేష్
- అనుమానంతో భార్యను, రాజేష్ దంపతులను కాల్చిచంపిన సురేందర్
గురువారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఇంటికి వచ్చిన సురేందర్, పక్కింటి వ్యక్తి రాజేష్ బయట ఉండటాన్ని చూశాడు. తన భార్య రాజేష్ తో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో, రాజేష్ ను, లావణ్యను కాల్చి చంపాడు. తుపాకి శబ్దానికి బయటకు వచ్చిన రాజేష్ భార్య శోభనూ హత్య చేశాడు. ఈ ఘటనతో రెండు జంటల పిల్లలూ అనాధలుగా మారగా, వారి బాధ్యతను తాము తీసుకుంటామని తెలిపిన సీఐఎస్ఎఫ్ అధికారులు, సురేందర్ ను సస్పెండ్ చేశారు. తమ కుమారుడి అనుమానానికి ఆవేశం తోడై, వృద్ధాప్యంలో తమకు శోకాన్ని మిగిల్చిందని సురేందర్ తల్లిదండ్రులు వాపోయారు.