shuttlers: ముంబైలో తలపడిన బ్యాడ్మింటన్ దిగ్గజాలు.. సందడి చేసిన గ్రేట్ షట్లర్లు!

  • ప్రపంచ దిగ్గజాలందరూ ఒకే చోట
  • లీ చోంగ్-లిన్ డాన్ జోడీపై విజయం సాధించిన సైనా- సింధు  జోడీ
  • ఆద్యంతం అలరించిన మ్యాచ్‌లు

‘లెజెండ్స్ విజన్ వరల్డ్ టూర్’లో భాగంగా శనివారం ముంబైలో జరిగిన మ్యాచ్‌లో గ్రేట్ షట్లర్లు అంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. ప్రపంచ ప్రఖ్యాత ఆటగాళ్లు లిన్ డాన్, లీ చోంగో వీ, పుల్లెల గోపీచంద్, పీటర్ గేడ్ నుంచి పీవీ సింధు, సైనా నెహ్వాల్ వరకు అందరూ కలిసి ఆడిన మ్యాచ్ అభిమానులను అలరించింది. డబుల్స్‌లో యువ షట్లర్లతో కలిసి బరిలోకి దిగిన గోపీచంద్ ప్రత్యర్థి పీటర్ గేడ్ జోడీ చేతిలో 4-9తో పరాజయం పాలయ్యాడు.

మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్-పీవీ సింధు కలిసి లీ చోంగ్-లిన్ డాన్ జోడీని ఎదుర్కొన్నారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో సైనా- సింధు జోడీనే విజయం సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సింధు-లిన్‌డాన్ జోడీ.. సైనా-చోంగ్ వీ జోడీని ఓడించింది. కిదాంబి శ్రీకాంత్.. లీయాంగ్‌తో కలిసి డబుల్స్ బరిలోకి దిగాడు. కనుల పండువగా సాగిన ఈ మ్యాచ్‌లు చూసేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, దిగ్గజ షట్లర్ ప్రకాశ్ పదుకునే సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

More Telugu News