ram. anupama: సెంటిమెంట్ గా భావించి ఆ సీన్స్ పెట్టలేదు!: కిషోర్ తిరుమల

  • రామ్ తాజా చిత్రంగా 'ఉన్నది ఒకటే జిందగీ' 
  • దర్శకుడిగా కిషోర్ తిరుమల 
  • బాల్యానికి సంబంధించిన ఎపిసోడ్స్ 
  • అలా చేసింది కథాబలం కోసమే      

కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన 'ఉన్నది ఒకటే జిందగీ' .. ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను అనుకున్న విధంగా ఈ కథను తెరకెక్కించగలిగానని అన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చుననే దానికి రామ్ పాత్ర అద్దం పడుతుందని చెప్పారు.

 ఇక 'నేను శైలజ'లో ఉన్నట్టుగానే ఈ సినిమాలోని బాల్యానికి సంబంధించిన సన్నివేశాలు వుంటాయని అన్నారు. 'నేను శైలజ' హిట్ అయింది కనుక .. ఆ సెంటిమెంట్ తో ఈ సినిమాలోనూ ఆ తరహా సీన్స్ ను పెట్టడానికి ట్రై చేయలేదని చెప్పారు. బాల్యంలో జరిగిన సంఘటనలు జీవితాంతం ప్రభావం చూపుతాయి గనుక, కథ మేరకే బాల్యానికి సంబంధించిన ఎపిసోడ్ ఉంటుందని అన్నారు. కథను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ఎపిసోడ్ ఉంటుందని చెప్పుకొచ్చారు.  

More Telugu News