ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రాణాలపైకి తెచ్చిన వాట్స్ యాప్ మెసేజ్!
- ఇద్దర్ని ఆసుపత్రి పాలు చేసిన వాట్స్ యాప్ మెసేజ్
- మైసమ్మగూడలోని నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల మధ్య ఘర్షణ
- ఇద్దరు విద్యార్థులపై కత్తులతో దాడి చేసిన సహవిద్యార్థి
స్నేహితులు భువనేశ్వర్ చేతులు పట్టుకోగా రోహిత్ దాడికి దిగాడు. దీంతో భువనేశ్వర్ ముఖం, చేతులు, నడుముకు గాయాలయ్యాయి. దీనిని చూసిన వీరి మిత్రుడు వైభవ్ ఆ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అతనికి కూడా గాయాలయ్యాయి. దీంతో హుటాహుటీన బాధితులను ఆసుపత్రికి తరలించారు.
దీనిపై సమాచారం అందడంతో హైదరాబాదు శివారు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. రోహిత్ పరారీలో ఉండడంతో అతని కోసం గాలింపు చేపట్టారు. దీనిపై క్షతగాత్రుడు భువనేశ్వర్ తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల విద్యార్థి కత్తులతో కళాశాలలో ప్రవేశించడమేంటని ప్రశ్నించారు. చదువుకోసం కళాశాలకు వెళ్తున్నారా? లేక గూండాలుగా మారేందుకు వెళ్తున్నారా? అని ఆమె ప్రశ్నించారు. కాగా, భువనేశ్వర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.