జగన్ స్వయంగా మాట్లాడినా మెత్తబడని బుట్టా రేణుక!
- మనసు మార్చుకోని బుట్టా రేణుక
- కార్యకర్తల ఒత్తిడంటూ తప్పించుకునే యత్నం
- కర్నూలులో వైకాపా దాదాపు ఖాళీ
కాగా, 2014 ఎన్నికల్లో కర్నూలు జిల్లాను వైకాపా దాదాపు క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలనూ ఆ పార్టీ గెలుచుకుంది. కర్నూలు నుంచి బుట్టా రేణుక, నంద్యాలలో ఎస్పీవై రెడ్డి విజయం సాధించారు. తొలుత ఎస్పీవై రెడ్డి వైకాపాకు హ్యాండిచ్చి టీడీపీలో చేరగా, ఆపై ఇప్పుడు బుట్టా కూడా అదే దారిలో నడుస్తున్నారు. ఎంపీల విషయం అటుంచితే, ఇప్పటికే కర్నూలు జిల్లాలోని పలువురు వైకాపా ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించగా, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సైతం టీడీపీలో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి.