మోదీ ప్రతీ గుజరాతీకి చంద్రుడిపై ఇల్లు కట్టించి ఇస్తారు.. ప్రధానిపై మరోమారు సెటైర్ వేసిన రాహుల్!
- 2030 నాటికి చంద్రుడినే భూమికి దించేస్తారని ఎద్దేవా
- పేదలకు కలలు అమ్మేస్తున్నారని ఆరోపణ
- ముగిసిన రాహుల్ గుజరాత్ పర్యటన
ఈ ఏడాది డిసెంబరు చివరిలోకానీ, వచ్చే ఏడాది మొదట్లో కానీ గుజరాత్ శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు పోటాపోటీ ప్రచారం ప్రారంభించారు. రాహుల్ గాంధీ అయితే ఏ చిన్న అవకాశం దొరికినా ప్రధానిపై విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల అమిత్ షా కుమారుడు జై షా కంపెనీపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, బుధవారంతో రాహుల్ గుజరాత్ పర్యటన ముగిసింది.