ఈ గాజు వంతెన మీద అడుగు వేయగలరా!... మరైతే వీడియో చూడండి
- పర్యాటకులను ఆకర్షిస్తున్న పగుళ్ల వంతెన
- పగుళ్ల కోసం స్పెషల్ ఎఫెక్ట్స్
- ప్రమాదం లేదంటున్న నిర్వాహకులు
పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ బ్రిడ్జిలో చివరి భాగాన్ని ఇలా పగుళ్లు పడే గాజువంతెనగా మార్చారు. ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ సాయంతో అడుగు వేసిన చోట పగుళ్లు ఏర్పడే అనుభూతి కలిగేలా స్పెషల్ ఎఫెక్ట్స్ ఏర్పాటుచేశారు అక్కడి నిర్వాహకులు. ఈ గాజు వంతెన అత్యంత భద్రతా ప్రమాణాలతోనే నిర్మించామని, ప్రమాదం జరుగుతుందేమోనన్న భయం అవసరం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ వంతెనపై పర్యాటకులు నడుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.