చేపల కోసం వల వేశాడు.. వలను లాగితే గుండె ఝల్లుమంది!
- వలలో చిక్కుకున్న కొండచిలువ
- తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఘటన
- చూడ్డానికి తరలి వచ్చిన ప్రజలు
తీరా చూస్తే, వలలో కొండచిలువ చిక్కుకుపోయి ఉంది. దాన్ని బయటకు తీయడం వారి వల్ల కాకపోవడంతో... చివరకు గునపాలతో పొడిచి చంపేశారు. అనంతరం ఈ కొండచిలువను పెదరాయవరం ఎస్సీ పేటకు తరలించారు. ఈ సందర్భంగా దాన్ని చూడ్డానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ, నీటి ప్రవాహంలో ఈ కొండచిలువ కొట్టుకువచ్చి వలలో ఇరుక్కుపోయి ఉండవచ్చని తెలిపాడు.