smart phone: దోమ‌ల్ని త‌రిమే స్మార్ట్‌ఫోన్‌.... త‌యారు చేసిన ఎల్‌జీ!

  • మోడ‌ల్ పేరు కే7ఐ
  • మ‌స్కిట్ అవే టెక్నాల‌జీతో మార్కెట్లోకి
  • ధ‌ర రూ. 7,990

స్మార్ట్‌ఫోన్ల‌తో అన్ని ర‌కాల ప‌నులు చేసుకునే స‌దుపాయం ఇప్పుడు అందుబాటులోకి వ‌చ్చింది. ఈ బాట‌లోనే దోమ‌ల్ని త‌రిమేసే టెక్నాల‌జీ ఉన్న స్మార్ట్‌ఫోన్లు కూడా మార్కెట్‌లోకి వ‌చ్చాయి. `కే7ఐ` పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను ఎల్‌జీ సంస్థ మార్కెట్లోకి విడుద‌ల చేసింది. దీనిలో `మ‌స్కిట్ అవే` అనే దోమ‌ల్ని దూరంగా ఉంచే సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించి ఈ ఫోన్‌ను రూపొందించింది. దీని స‌హాయంతో ప్ర‌త్యేకంగా జెట్ కాయిల్స్‌, ఆలౌట్ అవ‌స‌రం లేకుండానే దోమ‌ల్ని తరిమేయొచ్చు. ఇందులో 5 అంగుళాల డిస్‌ప్లే, 2500 ఎంఏహెచ్ బ్యాట‌రీ సదుపాయాలు ఉన్నాయి. అయితే ఇప్ప‌టికే ఈ `మ‌స్కిట్ అవే` టెక్నాల‌జీ ఎల్‌జీ కంపెనీ త‌యారుచేసిన కొన్ని టీవీ, ఏసీల్లో కూడా అందుబాటులో ఉంది

More Telugu News