balka suman: చంద్రబాబు డైరెక్షన్ లోనే తెలంగాణలో కూటమి ఏర్పడింది: బాల్క సుమన్

  • టీఆర్ఎస్ ను ఆపడం ఎవరి తరం కాదు
  • గులాబీ పార్టీని ఎదుర్కోలేకే టీడీపీ, కాంగ్రెస్, సీపీఐలు కూటమిగా ఏర్పడ్డాయి
  • ఏపీ నుంచి డబ్బు సంచులు వస్తున్నాయ్

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదుర్కొనే సత్తా ఏ పార్టీకి లేదని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. ఈ నేపథ్యంలోనే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్ లో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐలు కూటమిగా ఏర్పడ్డాయని చెప్పారు. ఆంధ్రా నాయుడు పంపిన డబ్బు సంచులతో సింగరేణి ఎన్నికల్లో కూటమి నేతలు ప్రలోభాలకు గురి చేయాలని యత్నిస్తున్నారని ఆరోపించారు.

ఆ డబ్బు అండతోనే సింగరేణిలో మీటింగ్ లు పెట్టి ఏఐటీయూసీకి ఓటు వేయాలంటూ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ను బలహీనపరిచేందుకు ఈ కూటమి చేస్తున్న కుయుక్తులు ఫలించబోవని అన్నారు. 2014 తర్వాత టీఆర్ఎస్ ను నిలువరించడం ఎవరి తరం కావడం లేదని చెప్పారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టీబీజీకేఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

More Telugu News