: పెను ప్రమాదం నుంచి బయటపడ్డ ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్

ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే, పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఓ ఇన్నోవా కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొంది. ఆ తర్వాత మరో మూడు వాహనాలను ఢీకొంది. ఇందులో రెడ్డి సుబ్రహ్మణ్యం కాన్వాయ్ లోని వాహనం కూడా ఉంది. ధ్వంసమైన వాహనాల్లో ఓ పోలీస్ పెట్రోలింగ్ వాహనం కూడా ఉంది. అయితే, ఆ సమయంలో పోలీసులు వాహనంలో లేకపోవడంతో వారికి ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెడ్డి సుబ్రహ్మణ్యం సురక్షితంగా బయటపడ్డారు. 

More Telugu News