ntr: 'జై లవ కుశ'లో ఐదో సాంగ్ అదుర్స్ అట!

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన 'జై లవకుశ' ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. కథ ప్రకారం ముందుగా నాలుగు పాటలనే ప్లాన్ చేసుకున్నారు. ఆ తరువాత అభిమానులు అసంతృప్తికి లోనవుతారేమోనని భావించి ఎన్టీఆర్ - తమన్నాల కాంబినేషన్లో అయిదో పాటను చిత్రీకరించారు.

 ఈ పాటను గురించి ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ను అందించిన కోన వెంకట్ ప్రస్తావించారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ బయటికి వచ్చిన నాలుగు పాటలకంటే ఐదవ పాట అద్భుతంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ .. తమన్నాలపై చిత్రీకరించిన ఈ పాట యూత్ ను ఊపేస్తుందని అన్నారు. డాన్స్ పరంగా ఎన్టీఆర్ కెరియర్లో ఈ సాంగ్ ది బెస్ట్ గా నిలుస్తుందనే నమ్మకం తనకి ఉందంటూ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నారు.    

More Telugu News