: 29 బంతుల్లో సెంచరీ కొట్టిన బాపట్ల యువ క్రికెటర్!

డ్యాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విధ్వంసక బ్యాటింగ్ ను చూస్తూ పెరిగిన ఓ యువ క్రికెటర్, అదే తరహాలో రెచ్చిపోవడాన్ని అలవాటుగా మార్చుకుని కేవలం 29 బంతుల్లోనే సెంచరీ సాధించి కొత్త రికార్డు సృష్టించాడు. బాపట్లకు చెందిన పల్లప్రోలు రవీంద్ర, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అండర్-22 జోనల్స్ పోటీల్లో ఈ ఫీట్ సాధించాడు. జింఖానా క్లబ్ తరఫున ఆడిన రవీంద్ర, జైదుర్ క్లబ్ తో జరిగిన పోటీల్లో 29 బంతుల్లో 102 పరుగులు సాధించాడు.

మొత్తం 58 బంతులాడిన రవీంద్ర, 13 సిక్స్ లు, నాలుగు ఫోర్లతో 144 పరుగులు సాధించడం గమనార్హం. రంజీ జట్టుకు ఎంపిక కావడం తన తదుపరి లక్ష్యమని, ఆపై టీమిండియాలో స్థానానికి కృషి చేస్తానని చెప్పే రవీంద్ర, లెగ్ స్పిన్నర్ గానూ రాణిస్తున్నాడు. తనకు ప్రభుత్వం చేయూతనిస్తే మరింతగా రాణిస్తానని, ఇందుకోసం ఏసీఏ సాయం చేయాలని అడుగుతున్నాడు.

More Telugu News