: వాట్సాప్లో మీకొచ్చిన మెసేజ్.. ఐదు నిమిషాల తర్వాత మాయం!
మైక్రోబ్లాగింగ్ యాప్ వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్ను ముందుకు తెస్తోంది. దీని ప్రకారం.. అవతలి వారికి పంపే మెసేజ్ ఐదు నిమిషాల తర్వాత మాయమైపోతుంది. అయితే మెసేజ్ పంపిన ఐదు నిమిషాల తర్వాతనా? లేక అవతలి వ్యక్తి చదివిన ఐదు నిమిషాల తర్వాతనా? అనే విషయంలో క్లారిటీ లేదు. ప్రస్తుతం వాట్సాప్ వెబ్ వెర్షన్ 0.2.4077లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ను సెట్టింగ్స్లో ఆన్ చేయడం ద్వారా పొందవచ్చు. అలాగే పంపే మెసేజ్లోని ఫాంట్లను ఫార్మాట్ చేసుకునే సౌలభ్యం కూడా వాట్సాప్ బీటా వెర్షన్ 2.17.148లో అందుబాటులో ఉంది. దీనిని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా టెక్ట్స్ను మనకు నచ్చిన విధంగా అందంగా మార్చుకోవచ్చు. ప్రస్తుతం బీటా వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్లు పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వచ్చేది తెలియరాలేదు.