: రాయగిరి-మోత్కూరు రహదారిపై గ్రామస్తుల వంటావార్పు, ధర్నా.. పోలీసులతో తీవ్ర వాగ్వివాదం
నల్గొండ జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలోని కొండాపూర్ గ్రామాన్ని మోటకొండూరులో కలపవద్దని నిరసన తెలుపుతూ రాయగిరి-మోత్కూరు రహదారిపై మోటకొండూరు గ్రామస్తులు పెద్ద ఎత్తున వంటావార్పు, ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొండాపూర్ను విలీనం చేయకుండా ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్తులు చేస్తున్న ఆందోళనను పోలీసులు అడ్డుకోవాలని చూశారు. దీంతో గ్రామస్తులు-పోలీసులకి మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. రాయగిరి-మోత్కూరు రహదారిపై భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.