: వెనక్కు తగ్గిన కేంద్రం... బంగారం కొనుగోళ్లపై ఎక్సైజ్ పన్ను తొలగింపు

బంగారం లావాదేవీలపై విధించిన పన్నులను అటు ప్రజలు, ఇటు ఆభరణాల వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ, కేంద్రం వెనక్కు తగ్గింది. ఆభరణాల నగదు కొనుగోళ్లపై విధించిన ఒక శాతం పన్నును తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం రేపటి నుంచి (జూన్ 1) అమలులోకి వస్తుందని ప్రకటించింది. వెండి మినహా మిగతా అన్ని రకాల విలువైన లోహాలతో తయారైన ఆభరణాలపై ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తూ, బడ్జెట్ లో ప్రతిపాదించగా, ఆపై దేశవ్యాప్తంగా జ్యూయెలర్స్ సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 29న అరుణ్ జైట్లీ కొత్త పన్నును ప్రతిపాదించగా, ఆపై మార్చి 2న ఆభరణాల దుకాణాలు మూతపడ్డ సంగతి తెలిసిందే. వ్యాపారులు దాదాపు ఆరు వారాల పాటు సమ్మె జరిపారు. ఫలితంగా ఈ నిర్ణయాన్ని మరోసారి పరిశీలిస్తామని కేంద్రం ప్రకటించింది. ఆ మేరకు ఒక శాతం పన్నును వెనక్కు తీసుకుంటున్నట్టు నేడు తెలియజేసింది.

More Telugu News