పరశురామ జయంతి
శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాల్లో పరశురామ అవతారానికి ఎంతో విశిష్టత వుంది. రేణుక - జమదగ్ని మహర్షి దంపతులకు జన్మించిన పరశురాముడు, మునికుమారుడిలా ఆశ్రమ ధర్మాలను నిర్వహిస్తూనే క్షత్రియుడిలా అసమానమైన పౌరుష పరాక్రమాలను ప్రదర్శించాడు. అలాంటి పరశురాముడిని ఆయన జయంతి రోజున స్మరించికోవడం ఎంతో మంచిదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
తల్లిదండ్రుల పట్ల పరశురాముడు అపారమైన ప్రేమానురాగాలను కలిగివుండేవాడు. తల్లి తల నరకమని తండ్రి ఆవేశంతో ఆదేశించినప్పుడు, క్షణమైనా ఆలస్యం చేయక ఆ పని చేసి పితృవాక్య పరిపాలకుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఆదేశించిన వెంటనే ఆచరణలో పెట్టిన పరశురాముడిని, ఏదైనా వరం కోరుకోమని జమదగ్ని మహర్షి అడిగితే తన తల్లిని బతికించమని కోరాడు. అలాగే ఒక క్షత్రియుడు తన తండ్రిని హతమారిస్తే తల్లి ఆవేదన చూడలేక క్షత్రియ జాతినంతటిని సమూలంగా నాశనం చేశాడు.
ఒకసారి వేటకి వచ్చిన కార్తవీర్యార్జునుడు, జమదగ్ని మహర్షి ఆశ్రమాన్ని కూడా దర్శిస్తాడు. అక్కడ గల కామదేనువును చూసి, దానిని తనకి ఇవ్వవలసినదిగా కోరతాడు. తన నుంచి దానాన్ని గ్రహించే అర్హత అతనికి లేదని చెబుతాడు మహర్శి. దాంతో జమదగ్ని మహర్షిని హతమార్చిన కార్తవీర్యార్జునుడు ఆ కామధేనువును తీసుకుని తన రాజ్యానికి బయలుదేరుతాడు. జమదగ్ని మరణించడంతో ఆ బాధతో తల్లడిల్లిపోతూ రేణుకాదేవి 21 మార్లు పరశురాముడిని పిలుస్తుంది. జరిగిన ఘోరం గురించి తెలుసుకుని తన తల్లి తనని ఎన్ని మార్లు పిలిచిందో అన్ని మార్లు క్షత్రియులపై దండెత్తి వారిని హతమార్చుతానని పరశురాముడు ప్రతిజ్ఞ చేస్తాడు.
ఆ తరువాత జమదగ్నిని భ్రుగుమహర్షి బతికించినప్పటికీ, ప్రతిజ్ఞ చేసిన ప్రకారం పరశురాముడు క్షత్రియ సంహారం చేస్తాడు. ఆ పాపాన్ని ప్రక్షాళ చేసుకోవడం కోసం అనేక ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠిస్తాడు. అలాంటి పరశురాముడిని అయన జయంతి సందర్భంగా ఆరాధించినట్టయితే, ఎవరికి సంబంధించిన రంగాల్లో వారు విజయాన్ని సాధిస్తారు. తలపెట్టిన కార్యాలు జయప్రదమవుతాయి.
తల్లిదండ్రుల పట్ల పరశురాముడు అపారమైన ప్రేమానురాగాలను కలిగివుండేవాడు. తల్లి తల నరకమని తండ్రి ఆవేశంతో ఆదేశించినప్పుడు, క్షణమైనా ఆలస్యం చేయక ఆ పని చేసి పితృవాక్య పరిపాలకుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఆదేశించిన వెంటనే ఆచరణలో పెట్టిన పరశురాముడిని, ఏదైనా వరం కోరుకోమని జమదగ్ని మహర్షి అడిగితే తన తల్లిని బతికించమని కోరాడు. అలాగే ఒక క్షత్రియుడు తన తండ్రిని హతమారిస్తే తల్లి ఆవేదన చూడలేక క్షత్రియ జాతినంతటిని సమూలంగా నాశనం చేశాడు.
ఒకసారి వేటకి వచ్చిన కార్తవీర్యార్జునుడు, జమదగ్ని మహర్షి ఆశ్రమాన్ని కూడా దర్శిస్తాడు. అక్కడ గల కామదేనువును చూసి, దానిని తనకి ఇవ్వవలసినదిగా కోరతాడు. తన నుంచి దానాన్ని గ్రహించే అర్హత అతనికి లేదని చెబుతాడు మహర్శి. దాంతో జమదగ్ని మహర్షిని హతమార్చిన కార్తవీర్యార్జునుడు ఆ కామధేనువును తీసుకుని తన రాజ్యానికి బయలుదేరుతాడు. జమదగ్ని మరణించడంతో ఆ బాధతో తల్లడిల్లిపోతూ రేణుకాదేవి 21 మార్లు పరశురాముడిని పిలుస్తుంది. జరిగిన ఘోరం గురించి తెలుసుకుని తన తల్లి తనని ఎన్ని మార్లు పిలిచిందో అన్ని మార్లు క్షత్రియులపై దండెత్తి వారిని హతమార్చుతానని పరశురాముడు ప్రతిజ్ఞ చేస్తాడు.
ఆ తరువాత జమదగ్నిని భ్రుగుమహర్షి బతికించినప్పటికీ, ప్రతిజ్ఞ చేసిన ప్రకారం పరశురాముడు క్షత్రియ సంహారం చేస్తాడు. ఆ పాపాన్ని ప్రక్షాళ చేసుకోవడం కోసం అనేక ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠిస్తాడు. అలాంటి పరశురాముడిని అయన జయంతి సందర్భంగా ఆరాధించినట్టయితే, ఎవరికి సంబంధించిన రంగాల్లో వారు విజయాన్ని సాధిస్తారు. తలపెట్టిన కార్యాలు జయప్రదమవుతాయి.