'ధురంధర్' ఒక ఫెనామినల్ ఫిల్మ్.. దేశాన్ని ఏకం చేసింది: రామ్ చరణ్
- రణ్వీర్ సింగ్ 'ధురంధర్' ఫ్రాంచైజీపై రామ్ చరణ్ ప్రశంసల వర్షం
- ఆ సినిమా ఒక అద్భుతమని, దేశాన్ని ఏకం చేసిందని వ్యాఖ్య
- రిపబ్లిక్ సమ్మిట్లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చరణ్
- రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు ప్రజల ఆమోదానికి నిదర్శనమని వెల్లడి
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. "ఇది ఒక అద్భుతమైన, అసాధారణమైన సినిమా. సరైన వేగంతో, అన్ని అంశాలు చక్కగా కుదిరాయి. జాతీయ సమగ్రత, దేశమే ప్రథమం అనే భావన మన సినిమాలకు చాలా ముఖ్యం. ఈ సినిమా దేశాన్ని ఏకం చేసింది. ఇలాంటి మరిన్ని చిత్రాలు రావాలి" అని అన్నారు.
ఈ ఫ్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద సాధించిన భారీ విజయంపైనా చరణ్ స్పందించారు. "ఈ సినిమా రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసి అత్యధిక గ్రాసర్గా నిలిచింది. బాక్సాఫీస్ నంబర్ అంటే ప్రజలు దానిని ఎంతగా అంగీకరించారనే దానికి నిదర్శనం. థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల సంఖ్యే ముఖ్యం. ఇది మన దేశానికి మేలు చేస్తోంది" అని ఆయన పేర్కొన్నారు.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన 'ధురంధర్' 2025 డిసెంబర్లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దీనికి సీక్వెల్గా ఈ ఏడాది మార్చిలో వచ్చిన 'ధురంధర్: ది రివెంజ్' రూ.1800 కోట్లను అధిగమించి, 'దంగల్' తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు నెట్ఫ్లిక్స్, జియోహాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉన్నాయి.