పవన్పై అనుచిత వ్యాఖ్యల కేసు: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు పోలీసుల నోటీసులు
- జూన్ 22న విచారణకు హాజరు కావాలని హిరమండలం పోలీసుల ఆదేశం
- 2025 మార్చిలో సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసు
- జనసేన నేత పిన్నింటి చిన్నారావు ఫిర్యాదుతో కేసు నమోదు
వివరాల్లోకి వెళితే.. 2025 మార్చి నెలలో పవన్ కల్యాణ్ను ఉద్దేశించి దువ్వాడ శ్రీనివాస్ సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై హిరమండలం మండలం గొట్ట గ్రామానికి చెందిన జనసేన నాయకుడు పిన్నింటి చిన్నారావు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు అప్పటి కొత్తూరు సీఐ సి.హెచ్. ప్రసాద్ కేసు నమోదు చేశారు.
ఈ పాత కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు, తాజాగా దువ్వాడ శ్రీనివాస్కు నోటీసులు పంపారు. విచారణ నిమిత్తం వ్యక్తిగతంగా హాజరు కావాలని అందులో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం (22వ తేదీన) ఆయన పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది.