లిస్ట్-ఎ క్రికెట్లో నయా వరల్డ్ రికార్డ్.. 11 బంతుల్లోనే వైభవ్ సూర్యవంశీ అర్ధసెంచరీ!
- దంబుల్లా వేదికగా శ్రీలంక ‘ఎ’ జట్టుతో ముక్కోణపు టోర్నీ
- ఫైనల్లో భారత్ ‘ఎ’ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం
- లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదు
- 94 పరుగుల వద్ద సహాన్ అరాచ్చిగే బౌలింగ్లో అవుట్
భారత యువ క్రికెట్ సంచలనం, 15 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచం అబ్బురపడేలా సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. శ్రీలంకలోని రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ ఫైనల్ మ్యాచ్లో వైభవ్ లంక బౌలింగ్ను తుత్తినియలు చేశాడు. కేవలం 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ మార్కును దాటి, లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకాన్ని నమోదు చేసిన బ్యాటర్గా చరిత్రకెక్కాడు. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు నిర్ణయాన్ని తలకిందులు చేస్తూ.. వైభవ్ తన అటాకింగ్ బ్యాటింగ్తో స్టేడియం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు.
29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 94 పరుగులు చేసిన సూర్యవంశీ శ్రీలంక కెప్టెన్ సహాన్ అరాచ్చిగే బౌలింగ్లో వియాస్కాంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (24 బంతుల్లో 37)తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన సూర్యవంశీ కేవలం 6.3 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 104 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచాడు. ఐపీఎల్లో ఇప్పటికే సత్తా చాటిన ఈ బీహార్ కుర్రాడి దూకుడు ముందు కుగదాస్ మథులన్ వంటి లంక ప్రధాన బౌలర్లు సైతం చేతులెత్తేశారు. కెప్టెన్ తిలక్ వర్మ, సీనియర్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్లతో కూడిన భారత్ ‘ఎ’ జట్టు ఈ మ్యాచ్లో ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ టైటిల్ దిశగా దూసుకుపోతోంది.
ఈ మ్యాచ్ కేవలం ఫైనల్ మాత్రమే కాకుండా ఇరు జట్ల మధ్య ఉన్న పాత పగలకు వేదికగా మారింది. జూన్ 15న జరిగిన లీగ్ మ్యాచ్లో శ్రీలంక ‘ఎ’ జట్టు వివాదాస్పద రీతిలో సూపర్ ఓవర్ గెలిచిన అనంతరం వైభవ్ను రెచ్చగొట్టడం, ఆపై మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య పెద్ద ఘర్షణ జరగడం తెలిసిందే. ఆ ఘటనలో వైభవ్కు జరిమానా పడినప్పటికీ.. నేడు దానికి తన పవర్ఫుల్ బ్యాటింగ్తోనే లంకకు సమాధానం ఇచ్చి ప్రతీకారం తీర్చుకున్నాడు. లీగ్ దశలో అఫ్ఘనిస్థాన్పై 101 పరుగుల భారీ విజయం సాధించి ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత్.. ఈ ఫైనల్లో లంకకు సొంత గడ్డపైనే చుక్కలు చూపిస్తోంది.
29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 94 పరుగులు చేసిన సూర్యవంశీ శ్రీలంక కెప్టెన్ సహాన్ అరాచ్చిగే బౌలింగ్లో వియాస్కాంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (24 బంతుల్లో 37)తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన సూర్యవంశీ కేవలం 6.3 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 104 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచాడు. ఐపీఎల్లో ఇప్పటికే సత్తా చాటిన ఈ బీహార్ కుర్రాడి దూకుడు ముందు కుగదాస్ మథులన్ వంటి లంక ప్రధాన బౌలర్లు సైతం చేతులెత్తేశారు. కెప్టెన్ తిలక్ వర్మ, సీనియర్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్లతో కూడిన భారత్ ‘ఎ’ జట్టు ఈ మ్యాచ్లో ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ టైటిల్ దిశగా దూసుకుపోతోంది.
ఈ మ్యాచ్ కేవలం ఫైనల్ మాత్రమే కాకుండా ఇరు జట్ల మధ్య ఉన్న పాత పగలకు వేదికగా మారింది. జూన్ 15న జరిగిన లీగ్ మ్యాచ్లో శ్రీలంక ‘ఎ’ జట్టు వివాదాస్పద రీతిలో సూపర్ ఓవర్ గెలిచిన అనంతరం వైభవ్ను రెచ్చగొట్టడం, ఆపై మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య పెద్ద ఘర్షణ జరగడం తెలిసిందే. ఆ ఘటనలో వైభవ్కు జరిమానా పడినప్పటికీ.. నేడు దానికి తన పవర్ఫుల్ బ్యాటింగ్తోనే లంకకు సమాధానం ఇచ్చి ప్రతీకారం తీర్చుకున్నాడు. లీగ్ దశలో అఫ్ఘనిస్థాన్పై 101 పరుగుల భారీ విజయం సాధించి ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత్.. ఈ ఫైనల్లో లంకకు సొంత గడ్డపైనే చుక్కలు చూపిస్తోంది.