భారత్ ధర్మసత్రం కాదు: అమిత్ షా వ్యాఖ్యలు
- చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారని విమర్శలు
- ప్రతి చొరబాటుదారుడినీ గుర్తించి దేశం నుంచి పంపిస్తామని స్పష్టీకరణ
- ఈ దేశానికి చెందిన వారు మాత్రమే ఇక్కడుంటారని ఉద్ఘాటన
చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా మార్చుకుని రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే ప్రయత్నిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. "ఈ దేశం ధర్మసత్రం కాదని వారికి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ దేశానికి చెందిన వారు మాత్రమే ఇక్కడ ఉంటారు. ప్రతి చొరబాటుదారుడినీ గుర్తించి, దేశం నుంచి తరిమికొడతాం" అని ఆయన పేర్కొన్నారు.