వైభవ్ సూర్యవంశీపై ప్రతీకారం తీర్చుకుంటారా?.. శ్రీలంక కెప్టెన్ సమాధానం ఇదే..!
- ఫైనల్కు ముందు శ్రీలంక కెప్టెన్ స్పందన
- వైభవ్ను టార్గెట్ చేయమని స్పష్టీకరణ
- గత మ్యాచ్లో సూపర్ ఓవర్ వివాదం
- విషెన్ హలంబాగేతో వాగ్వాదం
- సంఘటన సహజమేనన్న సహన్ అరచ్చిగే
గత మ్యాచ్లో సూపర్ ఓవర్ సందర్భంగా ఆటగాళ్ల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. చివరి మూడు బంతుల్లో 14 పరుగులు అవసరమైన వేళ వైభవ్ సూర్యవంశీ తన జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. అనంతరం శ్రీలంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో విషెన్ హలంబగేను తోసిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.
అయితే ఆ సంఘటనను పెద్దగా చూడాల్సిన అవసరం లేదని శ్రీలంక-ఏ కెప్టెన్ సహన్ అరచ్చిగే తెలిపారు. ‘‘సూపర్ ఓవర్లాంటి ఉత్కంఠభరిత పరిస్థితుల్లో భావోద్వేగాలు బయటపడటం సహజం. మా ఆటగాళ్లు ఎవరినీ టార్గెట్ చేయడం లేదు’’ అని చెప్పారు. ఆటపై పూర్తి దృష్టి పెట్టామని పేర్కొన్నారు.
తమ జట్టు ప్రస్తుతం మంచి స్థితిలో ఉందని అరచ్చిగే ధీమా వ్యక్తం చేశారు. బ్యాటింగ్లో ఎలాంటి సమస్య లేదన్నారు. ఫాస్ట్బౌలర్లు, స్పిన్నర్లు అద్భుతంగా రాణిస్తున్నారని చెప్పారు. ఫైనల్కు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
మరోవైపు భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ వైభవ్పై ప్రశంసలు కురిపించారు. పరుగుల పట్ల అతడికి ప్రత్యేక ఆకలి ఉందన్నారు. ఆటను ఆధిపత్యంగా మార్చే సామర్థ్యం అతడిలో కనిపిస్తోందని చెప్పారు. భవిష్యత్తులో టెస్టు క్రికెట్లో కూడా రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
అంతేకాదు వైభవ్ కోసం టీవీ ఆన్ చేసే స్థాయికి అతడు చేరుకున్నాడని శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. చిన్న వయసులోనే అభిమానులను ఆకర్షించే ప్రత్యేకమైన ఆకర్షణ అతడికి ఉందన్నారు. అయితే అతడిపై అధిక అంచనాల భారం మోపకుండా సహజంగా ఎదగనివ్వాలని సూచించారు.