సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు షాక్
- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు
- ఈ నెల 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశం
- తొక్కిసలాట కేసులో A11 నిందితుడిగా ఉన్న బన్నీ
- ఈ ఘటనలో మొత్తం 23 మందిపై ఛార్జ్షీట్
టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఈ నెల 22న (సోమవారం) వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో అల్లు అర్జున్ను 11వ నిందితుడిగా (A11) పోలీసులు చేర్చిన నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.
2024 డిసెంబర్ 4న 'పుష్ప 2' సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద భారీగా అభిమానులు గుమిగూడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ దురదృష్టకర ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు, విచారణ జరిపి మొత్తం 23 మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు.
ఈ ఛార్జ్షీట్లో సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని A1 నుంచి A10 వరకు నిందితులుగా పేర్కొన్న పోలీసులు, అల్లు అర్జున్ను A11గా చేర్చారు. తాజాగా ఈ కేసులో సంబంధం ఉన్న 19 మంది నిందితులకు కోర్టు సమన్లు పంపింది. ఇందులో భాగంగానే అల్లు అర్జున్కు కూడా నోటీసులు అందాయి.
2024 డిసెంబర్ 4న 'పుష్ప 2' సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద భారీగా అభిమానులు గుమిగూడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ దురదృష్టకర ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు, విచారణ జరిపి మొత్తం 23 మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు.
ఈ ఛార్జ్షీట్లో సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని A1 నుంచి A10 వరకు నిందితులుగా పేర్కొన్న పోలీసులు, అల్లు అర్జున్ను A11గా చేర్చారు. తాజాగా ఈ కేసులో సంబంధం ఉన్న 19 మంది నిందితులకు కోర్టు సమన్లు పంపింది. ఇందులో భాగంగానే అల్లు అర్జున్కు కూడా నోటీసులు అందాయి.