భారత్ చేతిలో చిత్తుగా ఓడటానికి కారణం అదే: పాక్ కెప్టెన్ ఫాతిమా సనా
- మహిళల టీ20 ప్రపంచకప్లో పాక్పై భారత్ ఘన విజయం
- చిరకాల ప్రత్యర్థిని 64 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించిన భారత్
- బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలే ఓటమికి కారణమన్న పాకిస్థాన్ కెప్టెన్
ఓటమిపై పాక్ కెప్టెన్ ఫాతిమా సనా స్పందన
మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా తమ ఓటమికి గల కారణాలను విశ్లేషించారు. తమ బ్యాటింగ్ ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచిందని ఆమె అంగీకరించారు. "మా బ్యాటింగ్ చాలా నిరాశపరిచింది. టోర్నమెంట్లో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. రాబోయే మ్యాచ్లలో తప్పకుండా పుంజుకోవాలి" అని అన్నారు.
భారత ఇన్నింగ్స్ సమయంలో 15 ఓవర్ల వరకు తాము నియంత్రణలోనే ఉన్నప్పటికీ, చివరి ఓవర్లలో అదనపు పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ చేజారిందని ఆమె తెలిపారు. "ఫీల్డింగ్లో చేసిన తప్పిదాలే మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయి. క్యాచ్లు మ్యాచ్లను గెలిపిస్తాయి. కానీ మేము కీలకమైన క్యాచ్లు వదిలేశాం. తదుపరి మ్యాచ్లో బౌలింగ్, ఫీల్డింగ్ రెండింటిలోనూ మెరుగుపడాల్సిన అవసరం ఉంది" అని ఫాతిమా సనా స్పష్టం చేశారు. ఈ విజయంతో ప్రపంచకప్లో భారత్ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగా, పాకిస్థాన్ తమ వైఫల్యాలను సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.