నీట్‌ రీ-ఎగ్జామ్‌: 'లాక్‌డౌన్‌'లోకి పేపర్‌ తయారుచేసిన నిపుణులు!

NEET Re exam Paper setters kept in lockdown for preparation
  • జూన్‌ 21న నీట్‌ రీ-ఎగ్జామ్‌
  • గత లీక్‌ల నేపథ్యంలో పటిష్ఠ ఏర్పాట్లు
  • పేపర్‌ తయారు చేసిన నిపుణుల గృహ నిర్బంధం
  • వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్‌
  • స్మార్ట్‌ వాచ్‌లూ అనుమతించని వైనం
నీట్ యూజీ రీ-ఎగ్జామ్ కోసం అధికారులు మునుపెన్నడూ లేని విధంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రశ్నపత్రాల రూపకల్పన, అనువాద ప్రక్రియల్లో పాల్గొనే నిపుణులందరినీ జూన్ 21 వరకు ఓ రహస్య ప్రాంతంలో గృహనిర్బంధం (లాక్‌డౌన్‌)లో ఉంచారు. గత నెలలో జరిగిన పరీక్ష పేపర్ లీక్ వివాదాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రశ్నపత్రాలు తయారు చేసే నిపుణులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా కట్ చేశారు. వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. వారు ఉంటున్న రహస్య కేంద్రంలో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. ఆ కేంద్రంలోకి ఎవరికీ అనుమతి లేదు. లోపలికి వెళ్లి వచ్చే ప్రతి ఒక్కరి కదలికలను అధికారులు నిరంతరం రికార్డు చేస్తున్నారు

ఈ ఐసోలేషన్ ప్రక్రియ భద్రతా వలయంలో కేవలం మొదటి అంచె మాత్రమేనని అధికారులు తెలిపారు. ప్రశ్నపత్రాల తయారీ, ప్రింటింగ్, ప్యాకేజింగ్, రవాణా వరకు ప్రతి దశను అత్యంత కఠినంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ మొత్తం గొలుసుకట్టు ప్రక్రియలో ఏ ఒక్క వ్యక్తికీ పూర్తి సమాచారం తెలియకుండా వ్యవస్థను విభజించారు. పేపర్ రవాణా కోసం భారత వైమానిక దళం విమానాలను ఉపయోగించే ఆలోచనలో ఉన్నారు.

నీట్ రీ-ఎగ్జామ్ జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పెన్-పేపర్ విధానంలో జరగనుంది. దేశవ్యాప్తంగా 551 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. గత పరీక్షలో జరిగిన లోపాలను పూర్తిగా సరిదిద్ది.. ఈసారి ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పరీక్షను విజయవంతం చేయడం ఎన్‌టీఏకు సవాలుగా మారింది.
Go Back to Shorts
NEET UG
NTA
NEET Re-exam
National Testing Agency
Paper Leak Prevention
Exam Security Measures

More Telugu News