భూముల విలువ పెంపు: రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పోటెత్తిన జనం

  • తెలంగాణ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద భారీ రద్దీ
  • భూముల మార్కెట్ విలువలు, ఛార్జీల పెంపు నేపథ్యంలో జనం పరుగులు
  • రద్దీని దృష్టిలో ఉంచుకొని పనివేళలు పొడిగించిన ప్రభుత్వం
  • రాత్రి 7:30 గంటల వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అనుమతి
తెలంగాణలో భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయనే వార్తల నేపథ్యంలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు జనంతో కిటకిటలాడాయి. పాత ధరలకే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకునేందుకు గురువారం ఉదయం నుంచే ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 4న రాత్రి 7:30 గంటల వరకు పనివేళలను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న వాస్తవ ధరలకు, అధికారిక రిజిస్ట్రేషన్ విలువలకూ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది రేపటి నుంచి అమలులోకి వస్తుండటంతో, పెరిగే ఛార్జీల భారం నుంచి తప్పించుకునేందుకు కొనుగోలుదారులు కార్యాలయాల వద్ద బారులు తీరారు.

ప్రజల రద్దీ, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న రెవెన్యూ శాఖ, ప్రత్యేకంగా గురువారం పనివేళలను పొడిగించింది. టోకెన్లు తీసుకున్న వారందరి రిజిస్ట్రేషన్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం పనివేళలు పొడిగించి సౌలభ్యం కల్పించినా, భారీ సంఖ్యలో జనం రావడంతో వ్యవస్థపై ఒత్తిడి నెలకొంది.

Telangana Registration prices hike
People queue to registration offices

More Telugu News