ఆర్సీబీ విజయం వేళ టిమ్ డేవిడ్పై వేటు.. ఐపీఎల్ 2027 తొలి మ్యాచ్కు దూరం
- ఐపీఎల్ 2026 ఫైనల్లో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన
- ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్పై ఒక మ్యాచ్ నిషేధం, 50 శాతం ఫీజు కోత
- అంపైర్ నితిన్ మీనన్ వైపు ఐస్ బ్యాగ్ విసిరినందుకు చర్యలు
- డీమెరిట్ పాయింట్లు ఐదుకు చేరడంతో ఆటోమేటిక్ సస్పెన్షన్
మే 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. గుజరాత్ ఇన్నింగ్స్లోని 10వ ఓవర్లో, ఒక క్యాచ్ రివ్యూలో ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ నాటౌట్గా ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేసిన టిమ్ డేవిడ్ అంపైర్ వైపు దూకుడుగా ఐస్ బ్యాగ్ విసిరారు.
ఈ చర్య ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.9ను ఉల్లంఘించడమేనని మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ నిర్ధారించారు. డేవిడ్ తన తప్పిదాన్ని అంగీకరించడంతో శిక్షను ఖరారు చేశారు. ఈ ఉల్లంఘనకు గాను డేవిడ్కు రెండు డీమెరిట్ పాయింట్లు లభించాయి. దీంతో 2026 సీజన్లో అతని మొత్తం డీమెరిట్ పాయింట్ల సంఖ్య ఐదుకు చేరింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక సీజన్లో ఐదు డీమెరిట్ పాయింట్లు చేరితే, తదుపరి సీజన్లోని మొదటి మ్యాచ్కు ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతారు.