విశాఖకు రూ. 1,500 కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరయ్యాయి: శ్రీభరత్
- అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద నగరానికి ప్రాజెక్టులు మంజూరయ్యాయన్న శ్రీభరత్
- మధురవాడ జోన్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తామని వెల్లడి
- గత ప్రభుత్వ హయాంలో పనులు నిలిచిపోయాయని విమర్శ
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించేందుకు 'దిశ' సమావేశం ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోందని విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ అన్నారు. విశాఖలో నిర్వహించిన దిశ సమావేశంలో 33 విభాగాలకు చెందిన అధికారులతో కలిసి పలు అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు ఆయన వెల్లడించారు.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న విశాఖను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద నగరానికి రూ.1,500 కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరైనట్లు శ్రీభరత్ ప్రకటించారు. ఇందులో భాగంగా మధురవాడ జోన్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సరఫరా, నగర నీటి పంపిణీ వ్యవస్థ బలోపేతం వంటి కీలక పనులను చేపట్టబోతున్నట్లు తెలిపారు.