రోహిత్ను ఎంపిక చేసి.. జైస్వాల్కు అన్యాయం చేశారు: సంజయ్ మంజ్రేకర్
- ఆఫ్ఘన్ తో వన్డే సిరీస్కు భారత జట్టు ఎంపికపై వివాదం
- యశస్వి జైస్వాల్ను తీసుకోకపోవడంపై మంజ్రేకర్ అసంతృప్తి
- జైస్వాల్కు సెలక్టర్లు క్షమాపణ చెప్పాలని సంచలన వ్యాఖ్య
- 39 ఏళ్ల రోహిత్ ఎంపికపై తీవ్ర అభ్యంతరం
- 2027 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకోవాలని సూచన
ఒక స్పోర్ట్స్ పాడ్కాస్ట్లో మంజ్రేకర్ మాట్లాడుతూ.. "చివరిగా ఆడిన వన్డేలో అజేయ శతకం (116) సాధించిన జైస్వాల్ను జట్టులోకి తీసుకోకపోవడంలో అర్థం లేదు. మరోవైపు, ఫిట్నెస్, ఫామ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మకు చోటు కల్పించారు. దీని వెనుక ఉన్న తర్కం ఏంటో వివరించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో రోహిత్ను ఎంపిక చేయాల్సి వస్తే, ముందుగా జైస్వాల్కు ఫోన్ చేసి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అతను అత్యున్నత స్థాయిలో అద్భుతంగా రాణిస్తున్న యువ కెరటం" అని అన్నారు.
2027 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని, జట్టు భవిష్యత్తు కోసం ఆలోచించాల్సిన అవసరం ఉందని మంజ్రేకర్ సూచించారు. యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ వంటి యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వడం ద్వారా బలమైన జట్టును నిర్మించాలని అభిప్రాయపడ్డారు. మంజ్రేకర్ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.