'పుష్ప' అవకాశం నాకూ షాకే.. ఆ పాత్ర నా జీవితాన్నే మార్చేసింది: సునీల్
- 'పుష్ప'లో అవకాశం ఎలా వచ్చిందో చెప్పిన సునీల్
- కామెడీ చేయొద్దని సుకుమార్ కండిషన్ పెట్టారన్న నటుడు
- కొత్త చిత్రం 'కాటాలన్' ప్రమోషన్లో ఆసక్తికర వ్యాఖ్యలు
- గురువారం విడుదల కానున్న 'కాటాలన్' తెలుగు వెర్షన్
కమెడియన్గా కెరీర్ ప్రారంభించి, హీరోగా, విలన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సునీల్, 'పుష్ప' చిత్రంలో మంగళం శ్రీను పాత్రకు ఎంపికవడం తనకూ ఓ షాక్ అని అన్నారు. ఈ పాత్ర తన జీవితాన్నే మార్చేసిందని, అన్ని భాషల్లోనూ అవకాశాలు తెచ్చిపెట్టిందని ఆయన తెలిపారు.
తన తాజా మలయాళ చిత్రం ‘కాటాలన్’ తెలుగు వెర్షన్ ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో సునీల్ ఈ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘పుష్ప’లో విలన్గా సుకుమార్ మిమ్మల్ని ఎలా ఊహించుకున్నారని అడగ్గా.. "లాక్డౌన్ సమయంలో నేను కామెడీ పాత్రలు కాకుండా వేరేవి చేస్తున్నానని సుకుమార్కు చెప్పాను. రెండు రోజులకే ఆయన ఫోన్ చేసి 'పుష్ప'లో పూర్తిస్థాయి విలన్ పాత్ర ఉంది, కానీ కామెడీ చేయకూడదు, శరీరం కూడా కదపకుండా హావభావాలు పలికించాలని చెప్పారు," అని సునీల్ వివరించారు.
లుక్ టెస్ట్ కోసం పంపిన కాస్ట్యూమ్స్తో రకరకాలుగా ఫోటోలు తీసి పంపించానని, అవి నచ్చడంతో ఆ పాత్రకు ఎంపికయ్యానని గుర్తుచేసుకున్నారు. షూటింగ్ జరిగినన్ని రోజులు పాత్ర కోసం నుదుటిపై షేవ్ చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
సునీల్ 'మారి' అనే కీలక పాత్రలో నటించిన 'కాటాలన్' చిత్రం మే 28న తెలుగులో విడుదల కానుంది. ఏనుగు దంతాల అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి పాల్ జార్జ్ దర్శకుడు. ఇందులో ఆంటోనీ వర్గీస్, కబీర్ దుహాన్ సింగ్, దుషారా విజయన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
తన తాజా మలయాళ చిత్రం ‘కాటాలన్’ తెలుగు వెర్షన్ ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో సునీల్ ఈ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘పుష్ప’లో విలన్గా సుకుమార్ మిమ్మల్ని ఎలా ఊహించుకున్నారని అడగ్గా.. "లాక్డౌన్ సమయంలో నేను కామెడీ పాత్రలు కాకుండా వేరేవి చేస్తున్నానని సుకుమార్కు చెప్పాను. రెండు రోజులకే ఆయన ఫోన్ చేసి 'పుష్ప'లో పూర్తిస్థాయి విలన్ పాత్ర ఉంది, కానీ కామెడీ చేయకూడదు, శరీరం కూడా కదపకుండా హావభావాలు పలికించాలని చెప్పారు," అని సునీల్ వివరించారు.
లుక్ టెస్ట్ కోసం పంపిన కాస్ట్యూమ్స్తో రకరకాలుగా ఫోటోలు తీసి పంపించానని, అవి నచ్చడంతో ఆ పాత్రకు ఎంపికయ్యానని గుర్తుచేసుకున్నారు. షూటింగ్ జరిగినన్ని రోజులు పాత్ర కోసం నుదుటిపై షేవ్ చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
సునీల్ 'మారి' అనే కీలక పాత్రలో నటించిన 'కాటాలన్' చిత్రం మే 28న తెలుగులో విడుదల కానుంది. ఏనుగు దంతాల అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి పాల్ జార్జ్ దర్శకుడు. ఇందులో ఆంటోనీ వర్గీస్, కబీర్ దుహాన్ సింగ్, దుషారా విజయన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.