పాక్లో అసలు బాస్ ఎవరు?.. డొనాల్డ్ ట్రంప్ సింగిల్ పోస్ట్తో తేలిపోయిన గుట్టు!
- అనుకోకుండానే సమాధానమిచ్చిన ట్రంప్
- పాక్ ప్రధాని పేరు కాకుండా ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పేరు ప్రస్తావన
- ఇది దౌత్య పొరపాటు కాదంటున్న విశ్లేషకులు
- ఇటీవల సంక్షోభాల సమయంలో కీలకంగా మారిన మునీర్ పాత్ర
ఇస్లామాబాద్ అధికార పీఠంపై అసలైన పట్టు ఎవరిది? అన్న దశాబ్దాల నాటి ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా పోస్ట్తో అనుకోకుండానే సమాధానమిచ్చారు. ఇరాన్ యుద్ధం ముగిసిన తర్వాత ముస్లిం మెజారిటీ దేశాలన్నీ 'అబ్రహం అకార్డ్స్' (ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాల ఒప్పందం)లో చేరాలని కోరుతూ ట్రంప్ 'ట్రూత్ సోషల్' వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలో తాను మాట్లాడిన ప్రపంచ దేశాల అధినేతల పేర్లను ఆయన ప్రస్తావించారు. అయితే, మిగతా దేశాల అధికారిక దేశాధినేతల పేర్లను పేర్కొన్న ట్రంప్.. పాకిస్థాన్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఆ దేశ ఎన్నికైన ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పేరును పూర్తిగా పక్కనబెట్టి, ఆర్మీ చీఫ్ సయ్యద్ అసిమ్ మునీర్ పేరును చేర్చడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.
సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసిల పేర్లను వారి అధికారిక హోదాలతో సహా ప్రస్తావించిన ట్రంప్.. పాక్ ప్రధానిని మాత్రం విస్మరించారు. ఇది దౌత్యపరమైన పొరపాటు కంటే కూడా పాకిస్తాన్లో ఎన్నికైన ప్రభుత్వం కంటే సైనిక స్థాపనకే (మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్) విదేశాంగ, జాతీయ భద్రతా అంశాల్లో అత్యధిక పట్టు ఉందనే వాస్తవాన్ని స్పష్టం చేస్తోంది. ఇటీవల కాలంలో ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభాలు, అమెరికాతో సంబంధాల విషయంలో ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పాత్రే కీలకంగా మారింది.
మరోవైపు, ఈ వీకెండ్లో పాకిస్థాన్ సహా పలు అరబ్ దేశాల నేతలతో ట్రంప్ జరిపిన ఉన్నత స్థాయి కాన్ఫరెన్స్ కాల్లో ఇజ్రాయెల్ను గుర్తించాలనే ప్రతిపాదన రాగా.. పాక్ వైపు నుంచి పూర్తి నిశ్శబ్దం వ్యక్తమైనట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ 'ఆక్సియోస్' నివేదించింది. పాలస్తీనా స్వతంత్ర దేశంతో కాకుండా ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకుంటే పాకిస్థాన్ తీవ్రమైన అంతర్గత రాజకీయ సంక్షోభం, ప్రజాగ్రహం వ్యక్తమయ్యే ప్రమాదం ఉంది. అటు ఇటు కాకుండా ఇరుక్కుపోయిన ఇస్లామాబాద్.. అటు ట్రంప్ ప్రతిపాదనను తీవ్రంగా తిరస్కరించి అమెరికాతో ఆర్థిక, దౌత్య సంబంధాలను చెడగొట్టుకోలేదు, ఇటు ఇజ్రాయెల్ను గుర్తించి దేశంలో అలజడిని సృష్టించుకోలేక తీవ్ర ఇరకాటంలో పడింది.
సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసిల పేర్లను వారి అధికారిక హోదాలతో సహా ప్రస్తావించిన ట్రంప్.. పాక్ ప్రధానిని మాత్రం విస్మరించారు. ఇది దౌత్యపరమైన పొరపాటు కంటే కూడా పాకిస్తాన్లో ఎన్నికైన ప్రభుత్వం కంటే సైనిక స్థాపనకే (మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్) విదేశాంగ, జాతీయ భద్రతా అంశాల్లో అత్యధిక పట్టు ఉందనే వాస్తవాన్ని స్పష్టం చేస్తోంది. ఇటీవల కాలంలో ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభాలు, అమెరికాతో సంబంధాల విషయంలో ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పాత్రే కీలకంగా మారింది.
మరోవైపు, ఈ వీకెండ్లో పాకిస్థాన్ సహా పలు అరబ్ దేశాల నేతలతో ట్రంప్ జరిపిన ఉన్నత స్థాయి కాన్ఫరెన్స్ కాల్లో ఇజ్రాయెల్ను గుర్తించాలనే ప్రతిపాదన రాగా.. పాక్ వైపు నుంచి పూర్తి నిశ్శబ్దం వ్యక్తమైనట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ 'ఆక్సియోస్' నివేదించింది. పాలస్తీనా స్వతంత్ర దేశంతో కాకుండా ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకుంటే పాకిస్థాన్ తీవ్రమైన అంతర్గత రాజకీయ సంక్షోభం, ప్రజాగ్రహం వ్యక్తమయ్యే ప్రమాదం ఉంది. అటు ఇటు కాకుండా ఇరుక్కుపోయిన ఇస్లామాబాద్.. అటు ట్రంప్ ప్రతిపాదనను తీవ్రంగా తిరస్కరించి అమెరికాతో ఆర్థిక, దౌత్య సంబంధాలను చెడగొట్టుకోలేదు, ఇటు ఇజ్రాయెల్ను గుర్తించి దేశంలో అలజడిని సృష్టించుకోలేక తీవ్ర ఇరకాటంలో పడింది.