తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి

Tamil Nadu Road Accident Five Dead in Madurai Crash
  • మధురై సమీపంలో కారు ప్రమాదం
  • మృతుల్లో ముగ్గురు మహిళలు సహా ఒకే కుటుంబ సభ్యులు
  • ఆలయానికి వెళ్లి వస్తుండగా అదుపుతప్పిన వాహనం
తమిళనాడులోని మధురై సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధురైలోని అన్నా నగర్‌కు చెందిన ప్రకాశ్, అతని బంధువు రమేశ్‌తో పాటు మరో ముగ్గురు మహిళలు కారులో తిరుచిరాపల్లిలోని ప్రముఖ సమయపురం మరియమ్మన్ ఆలయానికి వెళ్లారు. ఆదివారం సాయంత్రం దైవ దర్శనం ముగించుకుని తిరిగి మధురైకి బయలుదేరారు.

మేలూరు సమీపంలోని అయ్యపట్టి వద్ద హైవేపై వీరి కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బ్యారియర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయి, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న కొట్టంపట్టి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం మేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు లేదా వాహనంలో సాంకేతిక లోపం వంటి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించడంతో వారి బంధువుల రోదనలు మిన్నంటాయి.  
Go Back to Shorts
Tamil Nadu Road Accident
Madurai accident
Tamil Nadu
Road accident India
Samayapuram Mariamman Temple
Melur
India road safety
Accident news

More Telugu News