ముందు రూ.8 వేల కోట్ల ఖరీదైన ఆ విమానాన్ని అమ్మేయండి.. ప్రధాని మోదీకి అవిముక్తేశ్వరానంద కౌంటర్
- పొదుపు పిలుపుపై ప్రధాని మోదీకి శంకరాచార్య కౌంటర్
- గోవుల సంఖ్య యూపీలోనే అత్యధికంగా తగ్గిందన్న అవిముక్తేశ్వరానంద
- సీఎం పదవి కోసం యోగి ఉన్నత స్థానాన్ని వదులుకున్నారని వ్యాఖ్య
- గోవధ చేసేవారి నుంచి నేతలు డబ్బు తీసుకుంటున్నారని ఆరోపణ
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రజలు పొదుపు పాటించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై జ్యోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద తీవ్రంగా స్పందించారు. ప్రజలకు నీతులు చెప్పే ముందు పాలకులు వాటిని ఆచరించి చూపించాలని, పొదుపు చర్యలు అధికారంలో ఉన్న వారి నుంచే మొదలవ్వాలని ఆయన హితవు పలికారు. సోన్భద్రలో తన 'గోవిష్ఠ యాత్ర'లో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
"ముందుగా ప్రభుత్వం తమ వద్ద ఉన్న రూ.8,000 కోట్ల విమానాన్ని అమ్మి, ఇంధన సామర్థ్యం ఉన్న విమానాన్ని ఉపయోగించాలి. ధర్మం మన ఇంటి నుంచే మొదలవ్వాలి" అని ప్రధాని మోదీకి ఆయన చురకలంటించారు. పశ్చిమాసియా సంక్షోభం దృష్ట్యా బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలు, ఇంధన వినియోగం తగ్గించుకోవాలని మోదీ చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అనంతరం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. గోవధను అరికట్టడంలో రాజకీయ పార్టీలు, నాయకులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వ గణాంకాలను ఉటంకిస్తూ, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరప్రదేశ్లోనే గోవుల జనాభా అత్యంత వేగంగా తగ్గిపోయిందని ఆయన పేర్కొన్నారు. "కేరళలో 8%, పశ్చిమ బెంగాల్లో 15%, ఝార్ఖండ్లో 24% గోవుల జనాభా పెరిగితే, యూపీలో అత్యధిక క్షీణత నమోదైంది. గోవధకు పాల్పడే వారి నుంచి కొందరు నాయకులు డబ్బులు తీసుకుని తమ రాజకీయాలను చక్కదిద్దుకుంటున్నారు" అని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
యూపీ ప్రభుత్వాన్ని 'పేపర్ టైగర్'గా అభివర్ణించిన శంకరాచార్య, ప్రభుత్వ ఆధ్వర్యంలోని గోశాలల్లో ఆవుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. "పీఠాధిపతి స్థానం రాజు కన్నా ఉన్నతమైనది. యోగి ఆదిత్యనాథ్ పీఠాధిపతిగా ఉంటూ ముఖ్యమంత్రి పదవిని స్వీకరించి తన ఉన్నత స్థానం నుంచి దిగిపోయారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి మాత్రమే, పీఠాధిపతి కాదు" అని స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గోవుల సంరక్షణపై ఓటర్లలో అవగాహన కల్పించడమే తన యాత్ర ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.
"ముందుగా ప్రభుత్వం తమ వద్ద ఉన్న రూ.8,000 కోట్ల విమానాన్ని అమ్మి, ఇంధన సామర్థ్యం ఉన్న విమానాన్ని ఉపయోగించాలి. ధర్మం మన ఇంటి నుంచే మొదలవ్వాలి" అని ప్రధాని మోదీకి ఆయన చురకలంటించారు. పశ్చిమాసియా సంక్షోభం దృష్ట్యా బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలు, ఇంధన వినియోగం తగ్గించుకోవాలని మోదీ చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అనంతరం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. గోవధను అరికట్టడంలో రాజకీయ పార్టీలు, నాయకులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వ గణాంకాలను ఉటంకిస్తూ, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరప్రదేశ్లోనే గోవుల జనాభా అత్యంత వేగంగా తగ్గిపోయిందని ఆయన పేర్కొన్నారు. "కేరళలో 8%, పశ్చిమ బెంగాల్లో 15%, ఝార్ఖండ్లో 24% గోవుల జనాభా పెరిగితే, యూపీలో అత్యధిక క్షీణత నమోదైంది. గోవధకు పాల్పడే వారి నుంచి కొందరు నాయకులు డబ్బులు తీసుకుని తమ రాజకీయాలను చక్కదిద్దుకుంటున్నారు" అని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
యూపీ ప్రభుత్వాన్ని 'పేపర్ టైగర్'గా అభివర్ణించిన శంకరాచార్య, ప్రభుత్వ ఆధ్వర్యంలోని గోశాలల్లో ఆవుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. "పీఠాధిపతి స్థానం రాజు కన్నా ఉన్నతమైనది. యోగి ఆదిత్యనాథ్ పీఠాధిపతిగా ఉంటూ ముఖ్యమంత్రి పదవిని స్వీకరించి తన ఉన్నత స్థానం నుంచి దిగిపోయారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి మాత్రమే, పీఠాధిపతి కాదు" అని స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గోవుల సంరక్షణపై ఓటర్లలో అవగాహన కల్పించడమే తన యాత్ర ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.