టీఆర్‌ఎస్ గూటికి మాజీ మంత్రి బోడ జనార్దన్... కవితతో భేటీ!

Ex minister Boda Janardhan to join Kavitha BRS party
  • కవిత పార్టీలోకి మొదలైన చేరికలు
  • టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించిన జనార్దన్
  • టీడీపీ నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచిన ఘనత

కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ లోకి చేరికలు మొదలయ్యాయి. సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి బోడ జనార్దన్ టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈరోజు బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో కవితతో జనార్ధన్ భేటీ అయ్యారు. 


కవితతో భేటీ అనంతరం బోడ జనార్దన్ మాట్లాడుతూ, త్వరలోనే తన అనుచరవర్గంతో కలిసి అధికారికంగా పార్టీలో చేరతానని వెల్లడించారు. ముఖ్యంగా సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో టీఆర్‌ఎస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి, పార్టీ విస్తరణకు తన వంతు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.


బోడ జనార్దన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత అనుభవజ్ఞుడైన నాయకుడిగా పేరుగాంచారు. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.
Go Back to Shorts
Boda Janardhan
Kavitha
TRS

More Telugu News