ఇండియాకు క్షమాపణలు చెప్పిన నేపాల్ ఎయిర్ లైన్స్

  • జమ్మూకశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపిన నేపాల్ ఎయిర్ లైన్స్
  • సాంకేతిక పొరపాటు వల్ల అలా జరిగిందని వెల్లడి
  • మరోసారి ఇలాంటి పొరపాటు జరగదన్న నేపాల్ ఎయిర్ లైన్స్

నేపాల్ ఎయిర్‌లైన్స్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వివాదాస్పద మ్యాప్ విషయంలో వెనక్కి తగ్గి, భారత్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పింది. జమ్మూకశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపడం వంటి సున్నితమైన అంశంపై తలెత్తిన వివాదాన్ని ఆ సంస్థ సకాలంలో గుర్తించి సరిదిద్దుకుంది.


సోషల్ మీడియాలో షేర్ చేసిన నెట్‌వర్క్ మ్యాప్‌లో అంతర్జాతీయ సరిహద్దులకు సంబంధించి భౌగోళిక వ్యత్యాసాలు ఉన్నాయని నేపాల్ ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. ఆ మ్యాప్ తమ దేశ అధికారిక వైఖరి కాదని, కేవలం అది ఒక సాంకేతిక పొరపాటు మాత్రమేనని పేర్కొంటూ హృదయపూర్వక క్షమాపణలు కోరింది. భారత్‌తో ఉన్న బలమైన సంబంధాలను తాము ఎంతో గౌరవిస్తామని, ఎవరి మనస్తాపానికైనా తాము చింతిస్తున్నామని తెలిపింది.


వివాదం రేగిన వెంటనే ఆ పోస్ట్‌ను తొలగించడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి సమాచార లోపాలు తలెత్తకుండా అంతర్గత సమీక్ష నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. మన దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన జమ్మూకశ్మీర్ విషయంలో జరిగిన ఈ తప్పిదంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో నేపాల్ ఎయిర్‌లైన్స్ వేగంగా స్పందించింది. ఇరు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాల దృష్ట్యా ఇలాంటి పొరపాట్లు దౌత్యపరమైన ఇబ్బందులకు దారితీయకుండా ఉండటానికి వెంటనే క్షమాపణ చెప్పింది.


Nepal Airlines
India
Nepal
Jammu Kashmir
Pakistan
Social Media Map
Geographical Error
International Borders
Diplomatic Relations

More Telugu News