వివాహేతర సంబంధాల్లో దారుణం: ఒకచోట భర్తను చంపించిన భార్య.. మరోచోట ప్రియురాలి కొడుకును చంపిన ప్రియుడు

Extra Marital Affairs Lead to Murders in Telangana
  • వరంగల్‌లో రూ.5 లక్షల సుపారీ ఇచ్చి భర్తను చంపించిన భార్య
  • కామారెడ్డిలో అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి కొడుకును చంపిన ప్రియుడు
  • రెండు ఘటనల్లోనూ నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
వివాహేతర సంబంధాలు కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. అడ్డుగా ఉన్నారనే కారణంతో కట్టుకున్న భర్తను, కన్న కొడుకును అత్యంత కిరాతకంగా హత్య చేసిన రెండు వేర్వేరు ఘటనలు తెలంగాణలో వెలుగుచూశాయి. వరంగల్‌లో భార్యే సుపారీ ఇచ్చి భర్తను చంపించగా, కామారెడ్డిలో ప్రియురాలి కొడుకును ఆమె ప్రియుడు హతమార్చాడు.

వరంగల్ జిల్లా పరకాలకు చెందిన సుమన్‌ భరత్‌ (38) ఈ నెల 8న కనపడటం లేదని అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో విస్తుపోయే నిజాలు తెలిశాయి. సుమన్‌ భరత్‌ భార్య లావణ్యకు నరేశ్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై భర్త తాగి వచ్చి వేధించడంతో, అతడిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. 

ప్రియుడు, తమ్ముడితో కలిసి రూ.5 లక్షలకు సుపారీ మాట్లాడుకుని, తన బంగారం తాకట్టు పెట్టి మరీ డబ్బులు సమకూర్చింది. ప్లాన్ ప్రకారం హంతకులు ఈ నెల 3న సుమన్‌ భరత్‌కు మద్యం తాగించి, బీర్ బాటిల్‌తో కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. హత్యను వీడియో తీసి లావణ్యకు చూపించి మిగిలిన డబ్బులు తీసుకున్నారు. ఈ కేసులో లావణ్యతో పాటు హంతకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇలాంటిదే మరో దారుణ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. శ్రీరాంనగర్ కాలనీలో ఓ మహిళతో సహజీవనం చేస్తున్న నర్సింలు, తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆమె ఐదేళ్ల కుమారుడు శ్రావణ్‌ను హత్య చేశాడు. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో బాలుడి కళ్లలో కారం చల్లి, కర్రతో తలపై కొట్టి చంపాడు. ఈ హత్యకు బాలుడి తల్లి కూడా సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Go Back to Shorts
Extra marital affairs
Warangal Crime
Kamareddy Crime
Telangana Crime
Murder for affair
Husband Murder
Son Murder
Supari Killing

More Telugu News