లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు చుక్కెదురు... విపక్షాల తీరుపై చంద్రబాబు ఫైర్

Chandrababu Naidu Slams Opposition Over Women Reservation Bill Failure
  • లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించని వైనం
  • అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు
  • మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవడంతో వీగిపోయిన బిల్లు
  • కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలే కారణమన్న సీఎం చంద్రబాబు
  • ఇది మహిళలకు చేసిన ద్రోహమని వ్యాఖ్య
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే కీలక బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశం మాత్రమే కాదని, పార్లమెంటులో సమాన ప్రాతినిధ్యం ఆశిస్తున్న లక్షలాది మంది మహిళలకు చేసిన ద్రోహమని ఆయన అన్నారు. ఈ విషయాన్ని దేశం గుర్తుంచుకుంటుందని హెచ్చరించారు.

వివరాల్లోకి వెళితే, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. అయితే, రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల ప్రత్యేక మెజారిటీ అవసరం కాగా, ఆ మార్కును అందుకోకపోవడంతో బిల్లు వీగిపోయింది. 2029 ఎన్నికల నుంచే ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ పరిణామంపై ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్‌ను రీపోస్ట్ చేస్తూ, మహిళా సాధికారతకు అడ్డుపడిన ప్రతిపక్షాల వైఖరిని ఆయన తప్పుబట్టారు. వారి చర్యల వల్ల దేశం ఒక చారిత్రక అవకాశాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Women Reservation Bill
Lok Sabha
Andhra Pradesh
Indian Parliament
Amit Shah
Congress
Political News
महिला రిజర్వేషన్ బిల్లు
Opposition Parties

More Telugu News