శ్రీవారి భక్తులకు గమనిక... జులై నెల టికెట్ల షెడ్యూల్ విడుదల
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలకమైన అప్డేట్ ఇచ్చింది. 2026 జులై నెలకు సంబంధించిన వివిధ రకాల దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల కోటా విడుదల తేదీలను అధికారికంగా ప్రకటించింది. భక్తులు ముందుగానే తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకునేందుకు వీలుగా, ఏప్రిల్ 18 నుంచి దశలవారీగా ఈ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
విడుదలయ్యే టికెట్లు, తేదీల వారీగా వివరాలు:
ఏప్రిల్ 18: ఉదయం 10 గంటలకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ఆర్జిత సేవల కోసం ఎలక్ట్రానిక్ డిప్ నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది. భక్తులు ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
ఏప్రిల్ 21: ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను భక్తులు నేరుగా బుక్ చేసుకోవచ్చు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటాను విడుదల చేస్తారు.
ఏప్రిల్ 23: ఈ రోజు మూడు వేర్వేరు సమయాల్లో టోకెన్లు విడుదలవుతాయి.
ఉదయం 10 గంటలకు: అంగప్రదక్షిణ టోకెన్లు.
ఉదయం 11 గంటలకు: శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు.
మధ్యాహ్నం 3 గంటలకు: వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లు.
ఏప్రిల్ 24: భక్తులు అత్యధికంగా ఎదురుచూసే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల బుకింగ్ కోటాను అందుబాటులో ఉంచుతారు.
భక్తులు తమకు కావాల్సిన సేవలు, దర్శన టికెట్లు, గదులను కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ అయిన ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ వివరాలను టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.
విడుదలయ్యే టికెట్లు, తేదీల వారీగా వివరాలు:
ఏప్రిల్ 18: ఉదయం 10 గంటలకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ఆర్జిత సేవల కోసం ఎలక్ట్రానిక్ డిప్ నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది. భక్తులు ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
ఏప్రిల్ 21: ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను భక్తులు నేరుగా బుక్ చేసుకోవచ్చు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటాను విడుదల చేస్తారు.
ఏప్రిల్ 23: ఈ రోజు మూడు వేర్వేరు సమయాల్లో టోకెన్లు విడుదలవుతాయి.
ఉదయం 10 గంటలకు: అంగప్రదక్షిణ టోకెన్లు.
ఉదయం 11 గంటలకు: శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు.
మధ్యాహ్నం 3 గంటలకు: వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లు.
ఏప్రిల్ 24: భక్తులు అత్యధికంగా ఎదురుచూసే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల బుకింగ్ కోటాను అందుబాటులో ఉంచుతారు.
భక్తులు తమకు కావాల్సిన సేవలు, దర్శన టికెట్లు, గదులను కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ అయిన ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ వివరాలను టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.