ప్రేమ జంటల పాలిట కీచకుడు... పల్నాడు జిల్లాలో ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు

పల్నాడు జిల్లా మాచర్లలో ఓ ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రేమ జంటలను బెదిరించి డబ్బు వసూలు చేయడంతో పాటు, మహిళలను వేధించారన్న ఆరోపణలు నిరూపితం కావడంతో ఏఎస్సై శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ పోలీసు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాల్లోకి వెళితే, మాచర్ల నియోజకవర్గంలోని పర్యాటక ప్రాంతాలకు వచ్చే ప్రేమికులు, కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా శ్రీనివాస్ వ్యవహరించినట్లు తేలింది. వారి ఏకాంతాన్ని వీడియోలు తీయించి, బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడని విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా, యువతులను బెదిరించి తన కోరికలు తీర్చాలంటూ ఒత్తిడి చేసి వేధింపులకు పాల్పడేవాడని కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

ఆయన అకృత్యాలకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసు శాఖ వెంటనే స్పందించి విచారణ చేపట్టింది. విచారణలో ఆరోపణలన్నీ నిజమని తేలడంతో ఏఎస్సై శ్రీనివాస్‌పై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు. 

Srinivas ASI
Macharla
Palnadu district
প্রেমের যুগল
প্রেমী যুগল
একা
Police corruption
Andhra Pradesh police
প্রেমের যুগল
একা
Crime news

More Telugu News