జయప్రద వారసుడి సినీ అరంగేట్రం: వెండితెరకు పరిచయం కానున్న సామ్రాట్
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న సీనియర్ నటి జయప్రద వారసుడు (సోదరుడి కుమారుడు) సామ్రాట్ ఇప్పుడు వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. గత కొంతకాలంగా సామ్రాట్ హీరోగా ఎంట్రీ ఇస్తారంటూ సాగుతున్న ప్రచారానికి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ లభించింది. సామ్రాట్ను టాలీవుడ్కు గ్రాండ్గా పరిచయం చేసేందుకు ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ సిద్ధమైంది. భారీ బడ్జెట్తో కూడిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి ముందు సామ్రాట్ నటన, డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్లలో ప్రత్యేక శిక్షణ పొంది అన్ని విధాలా సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు పాన్-ఇండియా గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో జయప్రద స్వయంగా రంగంలోకి దిగారు. సామ్రాట్ సరసన నటించేందుకు టాలీవుడ్లోని ఒక టాప్ హీరోయిన్ అయితేనే బాగుంటుందని ఆమె భావిస్తుండటంతో, ప్రస్తుతం చిత్ర యూనిట్ ఒక క్రేజీ హీరోయిన్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పరిశ్రమలోని ఇద్దరు ముగ్గురు అగ్ర తారలతో ప్రాథమిక చర్చలు జరిగినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. కథా చర్చల నుంచి సాంకేతిక నిపుణుల ఎంపిక వరకు ప్రతి విషయంలోనూ జయప్రద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. త్వరలోనే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. జయప్రద వారసుడిగా సామ్రాట్ వెండితెరపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతారో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.