బెంగళూరులో మంత్రి నారా లోకేశ్కు ఘన స్వాగతం... ఫొటోలు ఇవిగో!
ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్కు బెంగళూరులో ఘన స్వాగతం లభించింది. శుక్రవారం ఆయన బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోగా, బెంగళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. బెంగళూరు సర్జాపూర్లోని గ్రీన్వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగే ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు లోకేశ్ ఈ పర్యటన చేపట్టారు.
ఈ పర్యటనకు ముందు రోజంతా మంత్రి లోకేశ్ అధికారిక కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపారు. అమరావతిలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం, రామాయపట్నం పోర్టు అభివృద్ధిపై చర్చించేందుకు ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలోనూ పాలుపంచుకున్నారు. ఈ సమావేశాలు ముగిసిన తర్వాత గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు.











ఈ పర్యటనకు ముందు రోజంతా మంత్రి లోకేశ్ అధికారిక కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపారు. అమరావతిలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం, రామాయపట్నం పోర్టు అభివృద్ధిపై చర్చించేందుకు ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలోనూ పాలుపంచుకున్నారు. ఈ సమావేశాలు ముగిసిన తర్వాత గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు.










