బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' చరిత్ర... హిందీలోనే రూ.1000 కోట్లు కొల్లగొట్టిన తొలి చిత్రం!
బాలీవుడ్ చిత్ర పరిశ్రమ సరికొత్త చరిత్ర సృష్టించింది. స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. కేవలం హిందీ వెర్షన్లోనే రూ.1,000 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది.
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, విడుదలైన 21 రోజుల్లోనే రూ.1,041 కోట్ల నికర వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే రూ.1,665 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును దాటి దూసుకుపోతోంది. గతంలో ‘బాహుబలి 2’, ‘పుష్ప 2’ వంటి పాన్-ఇండియా చిత్రాలు అన్ని భాషల్లో కలిపి భారీ వసూళ్లు సాధించాయి. కానీ, ఒకే భాషలో, అదీ కేవలం హిందీలోనే వెయ్యి కోట్ల నెట్ కలెక్షన్లు సాధించడం ‘ధురంధర్ 2’కే సాధ్యమైంది.
2025లో బ్లాక్బస్టర్ హిట్టయిన ‘ధురంధర్’కు సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రంపై ముందు నుంచే భారీ అంచనాలున్నాయి. కథలోని పట్టు, ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. రణ్వీర్ సింగ్ తన కెరీర్లోనే అత్యుత్తమ నటన కనబరచగా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ల నటన సినిమా స్థాయిని మరింత పెంచింది. దీంతో బాలీవుడ్లో ఈ చిత్రం ఓ చారిత్రక మైలురాయిగా నిలిచిపోయింది.
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, విడుదలైన 21 రోజుల్లోనే రూ.1,041 కోట్ల నికర వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే రూ.1,665 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును దాటి దూసుకుపోతోంది. గతంలో ‘బాహుబలి 2’, ‘పుష్ప 2’ వంటి పాన్-ఇండియా చిత్రాలు అన్ని భాషల్లో కలిపి భారీ వసూళ్లు సాధించాయి. కానీ, ఒకే భాషలో, అదీ కేవలం హిందీలోనే వెయ్యి కోట్ల నెట్ కలెక్షన్లు సాధించడం ‘ధురంధర్ 2’కే సాధ్యమైంది.
2025లో బ్లాక్బస్టర్ హిట్టయిన ‘ధురంధర్’కు సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రంపై ముందు నుంచే భారీ అంచనాలున్నాయి. కథలోని పట్టు, ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. రణ్వీర్ సింగ్ తన కెరీర్లోనే అత్యుత్తమ నటన కనబరచగా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ల నటన సినిమా స్థాయిని మరింత పెంచింది. దీంతో బాలీవుడ్లో ఈ చిత్రం ఓ చారిత్రక మైలురాయిగా నిలిచిపోయింది.