యనమలకు స్టెంట్.. ఆరోగ్యం నిలకడగా ఉందన్న టీడీపీ నేత
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత సమస్యతో ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు నిన్న ఆయనకు యాంజియోగ్రామ్ నిర్వహించి, ఒక స్టెంట్ అమర్చినట్లు యనమల కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపింది.
ఈ విషయంపై యనమల రామకృష్ణుడు స్వయంగా ఒక ప్రకటన విడుదల చేశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తాను, వైద్యుల సూచన మేరకే ఆస్పత్రిలో చేరినట్లు వివరించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నానని యనమల పేర్కొన్నారు. చికిత్స పూర్తయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి, త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకుని ప్రజల ముందుకు వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ విషయంపై యనమల రామకృష్ణుడు స్వయంగా ఒక ప్రకటన విడుదల చేశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తాను, వైద్యుల సూచన మేరకే ఆస్పత్రిలో చేరినట్లు వివరించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నానని యనమల పేర్కొన్నారు. చికిత్స పూర్తయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి, త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకుని ప్రజల ముందుకు వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.