అడివి శేష్ 'డెకాయిట్'... యాక్షన్ పార్ట్ లో ఇవే హైలైట్ అంట!
యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’. రేపు (ఏప్రిల్ 10న) ప్రేక్షకుల ముందుకు రానుంది. షనీల్ డియో దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించే అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా, ఇందులో వచ్చే కార్ ఛేజింగ్ సన్నివేశాలు సినిమాకే హైలైట్గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశాలకు మరింత ప్రామాణికత తీసుకువచ్చేందుకు, అడివి శేష్ డూప్ లేకుండా స్వయంగా ఎన్నో రిస్కీ షాట్లలో పాల్గొన్నారు.
ఈ యాక్షన్ ఘట్టాల చిత్రీకరణ అనుభవాన్ని అడివి శేష్ పంచుకున్నారు. "డెకాయిట్ చిత్రంలో ఎంతో ఉత్కంఠభరితమైన కార్ ఛేజ్ సీన్లు ఉన్నాయి. వాటిలో చాలా వరకు నేనే స్వయంగా కారు నడుపుతూ చేశాను. ప్రొఫెషనల్ గేర్తో, పూర్తి భద్రతా ఏర్పాట్ల మధ్య డ్రిఫ్టింగ్ చేయడం రోజూ చేసే పని కాదు. నిజంగా అది భలే థ్రిల్లింగ్గా అనిపించింది" అని తెలిపారు. కెమెరాలు, స్టంట్ కోఆర్డినేటర్ల మధ్య ఎంతో కట్టుదిట్టమైన ప్రణాళికతో ఈ సన్నివేశాలను చిత్రీకరించినట్లు వివరించారు.
"ఇలాంటి యాక్షన్ సీన్లు చిత్రీకరించేటప్పుడు ఎక్కువ రీటేక్లకు అవకాశం ఉండదు. ప్రతి కదలిక, ప్రతి మలుపు ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేసి ఉంటుంది. ఒక్క టేక్లోనే షాట్ను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేశాను. ఆ ఏకాగ్రత మనలోని ఇంద్రియాలను మరింత చురుగ్గా మారుస్తుంది. దర్శకుడు ఊహించిన విధంగా షాట్ను పూర్తి చేసినప్పుడు కలిగే సంతృప్తి మాటల్లో చెప్పలేనిది. ఇలాంటి క్షణాలే యాక్షన్ సినిమాలను ప్రత్యేకంగా నిలుపుతాయి" అని శేష్ అన్నారు.
కాగా, ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రియురాలు చేసిన మోసం వల్ల, నేరం చేయకపోయినా జైలు పాలైన వ్యక్తి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ‘
ఈ యాక్షన్ ఘట్టాల చిత్రీకరణ అనుభవాన్ని అడివి శేష్ పంచుకున్నారు. "డెకాయిట్ చిత్రంలో ఎంతో ఉత్కంఠభరితమైన కార్ ఛేజ్ సీన్లు ఉన్నాయి. వాటిలో చాలా వరకు నేనే స్వయంగా కారు నడుపుతూ చేశాను. ప్రొఫెషనల్ గేర్తో, పూర్తి భద్రతా ఏర్పాట్ల మధ్య డ్రిఫ్టింగ్ చేయడం రోజూ చేసే పని కాదు. నిజంగా అది భలే థ్రిల్లింగ్గా అనిపించింది" అని తెలిపారు. కెమెరాలు, స్టంట్ కోఆర్డినేటర్ల మధ్య ఎంతో కట్టుదిట్టమైన ప్రణాళికతో ఈ సన్నివేశాలను చిత్రీకరించినట్లు వివరించారు.
"ఇలాంటి యాక్షన్ సీన్లు చిత్రీకరించేటప్పుడు ఎక్కువ రీటేక్లకు అవకాశం ఉండదు. ప్రతి కదలిక, ప్రతి మలుపు ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేసి ఉంటుంది. ఒక్క టేక్లోనే షాట్ను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేశాను. ఆ ఏకాగ్రత మనలోని ఇంద్రియాలను మరింత చురుగ్గా మారుస్తుంది. దర్శకుడు ఊహించిన విధంగా షాట్ను పూర్తి చేసినప్పుడు కలిగే సంతృప్తి మాటల్లో చెప్పలేనిది. ఇలాంటి క్షణాలే యాక్షన్ సినిమాలను ప్రత్యేకంగా నిలుపుతాయి" అని శేష్ అన్నారు.
కాగా, ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రియురాలు చేసిన మోసం వల్ల, నేరం చేయకపోయినా జైలు పాలైన వ్యక్తి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ‘