భారత్లో మెర్సిడెస్ బెంజ్ అమ్మకాల రికార్డ్... విశాఖలోనూ కొత్త ఔట్లెట్
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, భారత మార్కెట్లో సరికొత్త ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. ఎన్నడూ లేనంతగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 19,363 యూనిట్లను విక్రయించి, గత ఏడాదితో పోలిస్తే 2.29 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 18,928 కార్లను విక్రయించింది. ఇదే సమయంలో, 2026 జనవరి-మార్చి త్రైమాసికంలో కూడా 7.45 శాతం వృద్ధితో 5,131 యూనిట్లను విక్రయించినట్లు గురువారం ప్రకటించింది.
ఈ అమ్మకాల వృద్ధికి ప్రధాన కారణం టాప్-ఎండ్, కోర్ లగ్జరీ సెగ్మెంట్లలో బలమైన డిమాండ్ ఉండటమేనని కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా, టాప్-ఎండ్ లగ్జరీ సెగ్మెంట్లో అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 16 శాతం, మార్చి త్రైమాసికంలో 25 శాతం పెరిగాయి. ఎస్-క్లాస్, మెర్సిడెస్-మేబ్యాక్ శ్రేణి, ఈక్యూఎస్ ఎస్ యూవీ, ఏఎంజీ పోర్ట్ఫోలియో వంటి మోడళ్లు ఈ విభాగంలో ఉన్నాయి. కంపెనీ మొత్తం అమ్మకాల్లో ఈ సెగ్మెంట్ వాటా 27 శాతంగా ఉండటం విశేషం. ఏఎంజీ జీ 63 వంటి కొన్ని మోడళ్ల కోసం ప్రస్తుతం 4 నెలల నుంచి ఏడాది వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది.
కంపెనీ 'కోర్' సెగ్మెంట్లోని సీ-క్లాస్, ఈ-క్లాస్ ఎల్డబ్ల్యూబీ సెడాన్లు, జీఎల్ సీ, జీఎల్ఈ ఎస్యూవీలు కూడా అమ్మకాల్లో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా, ఈ-క్లాస్ లాంగ్-వీల్బేస్ మోడల్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న లగ్జరీ కారుగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. అయితే, మార్కెట్లో తక్కువ ధర ఆఫర్లతో పోటీ పెరగడంతో 'ఎంట్రీ లగ్జరీ' సెగ్మెంట్ అమ్మకాలు 18 శాతం తగ్గాయని కంపెనీ తెలిపింది. కేవలం అమ్మకాల సంఖ్య పెంచుకోవడం కాకుండా, అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఉత్పత్తులను అందించడంపైనే తమ దృష్టి అని స్పష్టం చేసింది.
ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) అమ్మకాల్లోనూ మెర్సిడెస్ బెంజ్ మంచి వృద్ధిని కనబరిచింది. రూ.1.4 కోట్లకు పైగా ధర ఉన్న టాప్-ఎండ్ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఏకంగా 85 శాతం పెరిగాయి. భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా, ఏప్రిల్ 24న సీఎల్ఏ ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేయనుంది.
ఏపీలోనూ అవుట్ లెట్
'గో టు కస్టమర్' వ్యూహంతో దేశవ్యాప్తంగా తన రిటైల్ నెట్వర్క్ను విస్తరించేందుకు కంపెనీ సిద్ధమైంది. 2026లో 20కి పైగా కొత్త లగ్జరీ ఔట్లెట్లను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, అలాగే వారణాసి వంటి కొత్త నగరాల్లోకి ప్రవేశించనుంది. ఫ్రాంచైజ్ భాగస్వాముల ద్వారా రాబోయే రెండేళ్లలో రూ.450 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ విస్తరణ పనులు చేపట్టనున్నట్లు కంపెనీ వివరించింది.
ఈ అమ్మకాల వృద్ధికి ప్రధాన కారణం టాప్-ఎండ్, కోర్ లగ్జరీ సెగ్మెంట్లలో బలమైన డిమాండ్ ఉండటమేనని కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా, టాప్-ఎండ్ లగ్జరీ సెగ్మెంట్లో అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 16 శాతం, మార్చి త్రైమాసికంలో 25 శాతం పెరిగాయి. ఎస్-క్లాస్, మెర్సిడెస్-మేబ్యాక్ శ్రేణి, ఈక్యూఎస్ ఎస్ యూవీ, ఏఎంజీ పోర్ట్ఫోలియో వంటి మోడళ్లు ఈ విభాగంలో ఉన్నాయి. కంపెనీ మొత్తం అమ్మకాల్లో ఈ సెగ్మెంట్ వాటా 27 శాతంగా ఉండటం విశేషం. ఏఎంజీ జీ 63 వంటి కొన్ని మోడళ్ల కోసం ప్రస్తుతం 4 నెలల నుంచి ఏడాది వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది.
కంపెనీ 'కోర్' సెగ్మెంట్లోని సీ-క్లాస్, ఈ-క్లాస్ ఎల్డబ్ల్యూబీ సెడాన్లు, జీఎల్ సీ, జీఎల్ఈ ఎస్యూవీలు కూడా అమ్మకాల్లో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా, ఈ-క్లాస్ లాంగ్-వీల్బేస్ మోడల్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న లగ్జరీ కారుగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. అయితే, మార్కెట్లో తక్కువ ధర ఆఫర్లతో పోటీ పెరగడంతో 'ఎంట్రీ లగ్జరీ' సెగ్మెంట్ అమ్మకాలు 18 శాతం తగ్గాయని కంపెనీ తెలిపింది. కేవలం అమ్మకాల సంఖ్య పెంచుకోవడం కాకుండా, అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఉత్పత్తులను అందించడంపైనే తమ దృష్టి అని స్పష్టం చేసింది.
ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) అమ్మకాల్లోనూ మెర్సిడెస్ బెంజ్ మంచి వృద్ధిని కనబరిచింది. రూ.1.4 కోట్లకు పైగా ధర ఉన్న టాప్-ఎండ్ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఏకంగా 85 శాతం పెరిగాయి. భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా, ఏప్రిల్ 24న సీఎల్ఏ ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేయనుంది.
ఏపీలోనూ అవుట్ లెట్
'గో టు కస్టమర్' వ్యూహంతో దేశవ్యాప్తంగా తన రిటైల్ నెట్వర్క్ను విస్తరించేందుకు కంపెనీ సిద్ధమైంది. 2026లో 20కి పైగా కొత్త లగ్జరీ ఔట్లెట్లను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, అలాగే వారణాసి వంటి కొత్త నగరాల్లోకి ప్రవేశించనుంది. ఫ్రాంచైజ్ భాగస్వాముల ద్వారా రాబోయే రెండేళ్లలో రూ.450 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ విస్తరణ పనులు చేపట్టనున్నట్లు కంపెనీ వివరించింది.