Revanth Reddy: బాసర ఆలయంలో మనవడికి అక్షరాభ్యాసం చేయించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రంలో తన మనవడు రియాన్ష్ (రుద్రదేవ్)కు అక్షరాభ్యాసం చేయించారు. ముఖ్యమంత్రి ఈరోజు బాసరలో పర్యటించి ఆలయ అభివృద్ధి పనులకోసం భూమిపూజ చేశారు. కుటుంబంతో సహా ముఖ్యమంత్రి అమ్మవారిని దర్శించుకున్నారు. వేదపండితులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం తన మనవడికి అక్షరాభ్యాసం చేయించారు.
బాసర ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ మహారాజ్... రియాన్ష్ కు పలక బలపంతో అక్షరాభ్యాసం చేయించారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, వారి కుమార్తె నైమిశా రెడ్డి దంపతులతో పాటు మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, తన మనవడికి తల్లిదండ్రులు రియాన్ష్ అని పేరు పెట్టగా, తాను మాత్రం రుద్రదేవ్ అని పిలుచుకుంటానని ఒక సందర్భంలో ముఖ్యమంత్రి చెప్పారు.
బాసర ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ మహారాజ్... రియాన్ష్ కు పలక బలపంతో అక్షరాభ్యాసం చేయించారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, వారి కుమార్తె నైమిశా రెడ్డి దంపతులతో పాటు మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, తన మనవడికి తల్లిదండ్రులు రియాన్ష్ అని పేరు పెట్టగా, తాను మాత్రం రుద్రదేవ్ అని పిలుచుకుంటానని ఒక సందర్భంలో ముఖ్యమంత్రి చెప్పారు.