Meghamsh Srihari: మేఘాంశ్ శ్రీహరి కొత్త సినిమా ‘ఆస్మాన్’.. ఘనంగా ప్రారంభం
విలక్షణ నటుడు స్వర్గీయ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా ‘ఆస్మాన్’ అనే కొత్త చిత్రం శనివారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. శ్రీ క్లింకార సెల్యులాయిడ్స్ పతాకంపై వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ నందన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి యువ కథానాయకులు సాయి దుర్గ తేజ్, సందీప్ కిషన్, విష్వక్సేన్, నార్నె నితిన్, రోషన్ కనకాల, తిరువీర్, నటి/నిర్మాత నిహారిక కొణిదెల ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు.
ముహూర్తపు సన్నివేశానికి సాయి దుర్గ తేజ్ క్లాప్ కొట్టగా, సందీప్ కిషన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిహారిక కొణిదెల చిత్ర యూనిట్కు స్క్రిప్ట్ను అందజేశారు. ఈ సందర్భంగా హీరో మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ.. తన సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన సాయి తేజ్, సందీప్ కిషన్, నిహారిక సహా అందరికీ ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు రామ్ నందన్ అద్భుతమైన కథ చెప్పారని, ఈ చిత్రంతో తాము బ్లాక్బస్టర్ కొట్టబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
దర్శకుడు రామ్ నందన్ మాట్లాడుతూ.. "తెలుగులో ‘ఆస్మాన్’ నా తొలి చిత్రం. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. ఇది ఒక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. మూడు షెడ్యూల్స్లో చిత్రీకరణ పూర్తి చేస్తాం" అని వివరించారు.
నిర్మాత వెంకటేశ్ కొండారు మాట్లాడుతూ.. "మూడేళ్లుగా మంచి కథ కోసం ఎదురుచూస్తున్నాం. దివంగత కోడి రామకృష్ణ గారి శిష్యుడైన రామ్ నందన్ ఏడాది క్రితం ఈ కథ చెప్పారు. ఆయన గతంలో అరబిక్ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కథకు మేఘాంశ్ సరిగ్గా సరిపోతారని భావించాం. మే నెల నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం" అని తెలిపారు.
మరో నిర్మాత శ్రీకాంత్ మన్నెం మాట్లాడుతూ.. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తుండగా, షోయబ్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు.
ముహూర్తపు సన్నివేశానికి సాయి దుర్గ తేజ్ క్లాప్ కొట్టగా, సందీప్ కిషన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిహారిక కొణిదెల చిత్ర యూనిట్కు స్క్రిప్ట్ను అందజేశారు. ఈ సందర్భంగా హీరో మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ.. తన సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన సాయి తేజ్, సందీప్ కిషన్, నిహారిక సహా అందరికీ ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు రామ్ నందన్ అద్భుతమైన కథ చెప్పారని, ఈ చిత్రంతో తాము బ్లాక్బస్టర్ కొట్టబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
దర్శకుడు రామ్ నందన్ మాట్లాడుతూ.. "తెలుగులో ‘ఆస్మాన్’ నా తొలి చిత్రం. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. ఇది ఒక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. మూడు షెడ్యూల్స్లో చిత్రీకరణ పూర్తి చేస్తాం" అని వివరించారు.
నిర్మాత వెంకటేశ్ కొండారు మాట్లాడుతూ.. "మూడేళ్లుగా మంచి కథ కోసం ఎదురుచూస్తున్నాం. దివంగత కోడి రామకృష్ణ గారి శిష్యుడైన రామ్ నందన్ ఏడాది క్రితం ఈ కథ చెప్పారు. ఆయన గతంలో అరబిక్ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కథకు మేఘాంశ్ సరిగ్గా సరిపోతారని భావించాం. మే నెల నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం" అని తెలిపారు.
మరో నిర్మాత శ్రీకాంత్ మన్నెం మాట్లాడుతూ.. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తుండగా, షోయబ్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు.